రెండు జిల్లాల్లో కరోనా వ్యాప్తి తీవ్రం
కరోనా మొదటి దశలో 1,100 కేసులు దాటడానికి 65 రోజులు పట్టగా, రెండో దశలో 50 రోజుల్లోనే ఆ సంఖ్య కేసులు నమోదయ్యాయి. మూడో దశలో కేవలం 26 రోజుల్లోనే ఆ మార్కు దాటిందంటే వైరస్ వ్యాప్తి వేగం ఎలా
బళ్లారి, న్యూస్టుడే: కరోనా మొదటి దశలో 1,100 కేసులు దాటడానికి 65 రోజులు పట్టగా, రెండో దశలో 50 రోజుల్లోనే ఆ సంఖ్య కేసులు నమోదయ్యాయి. మూడో దశలో కేవలం 26 రోజుల్లోనే ఆ మార్కు దాటిందంటే వైరస్ వ్యాప్తి వేగం ఎలా ఉందో అర్థమవుతుంది. అఖండ బళ్లారి జిల్లాలో మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 3,929 నమూనాలు పరీక్షించగా, 1141 మందికి వైరస్ సోకింది. బళ్లారి జిల్లాలో 594, విజయనగరలో 547 కేసులు నమోదయ్యాయి. తాలూకాల వారీగా.. బళ్లారి-291, సండూరు-178, హొసపేటె-159, హూవినహడగలి-158, సిరుగుప్ప-94, కూడ్లిగి-82, హగరిబొమ్మనహళ్లి-79, హరపనహళ్లి-63, కంప్లి-23, కురుగోడు-8, కొట్టూరులో ఆరు కేసులు నమోదయ్యాయి. బళ్లారి, సండూరు తాలూకాల్లో కరోనా నియంత్రణకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. విజయనగర జిల్లాలోని హొసపేటె, హూవినహడగలిలోనూ మహమ్మారి వేగం పుంజుకుంది. రెండు జిల్లాల్లో తాజాగా 518 మంది కోలుకున్నారు. బళ్లారిలో 3,997 విజయనగరలో 2,171 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొత్తగా 10,984 మందికి టీకా వేసినట్లు జిల్లా ఆరోగ్య, కుటుంబ కల్యాణశాఖాధికారి డా.జనార్దన్ తెలిపారు.
ఎమ్మెల్యే కరుణాకరరెడ్డికి వైరస్
హొసపేటె: హరపనహళ్లి శాసనసభ్యుడు గాలి కరుణాకరరెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు బళ్లారి నివాసంలో క్వారంటైన్ అయ్యాను. ఆరోగ్యం నిలకడగా ఉంది. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తనను కలిసిన కార్యకర్తలు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!