మువ్వన్నెల రెపరెపలు..
దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించేందుకు అవకాశం కల్పించిన గణతంత్ర వేడుకలు వాడవాడలా ఘనంగా జరుపుకొన్నారు. సమాజంలో ఉన్నత స్థాయి నాయకుడి నుంచి సామాన్యుల వరకు ఎవరికివారు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఆయా జిల్లాలకు ఇటీవలే బాధ్య
శ్రీరంగపట్టణ : వేడుకల్లో వేద పండితుడు భాను ప్రకాశ్శర్మ తదితరులు
బెంగళూరు (ఎలక్ట్రానిక్ సిటీ), న్యూస్టుడే : దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించేందుకు అవకాశం కల్పించిన గణతంత్ర వేడుకలు వాడవాడలా ఘనంగా జరుపుకొన్నారు. సమాజంలో ఉన్నత స్థాయి నాయకుడి నుంచి సామాన్యుల వరకు ఎవరికివారు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఆయా జిల్లాలకు ఇటీవలే బాధ్య మంత్రులను నియమించడంతో వారంతా సంబంధిత జిల్లాల్లో తొలిసారి గణతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. కరోనా కారణంగా విద్యార్థులను ఉత్సవాలకు దూరంగా ఉంచారు. అన్ని ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకున్న తరువాతనే అక్కడక్కడ కొద్దిమందిని మాత్రమే అనుమతించారు. సాధారణంగా గణతంత్ర వేడుకల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొనేవారు. కరోనా కారణంగా ప్రజలకు అనుమతిని నిరాకరించారు. అయినప్పటికీ.. సంప్రదాయం ప్రకారం జిల్లా బాధ్య మంత్రులు గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ స్టేడియం చుట్టూ వాహనాల్లో సంచరించారు.
* కలబురగి జిల్లా జేవర్గిలో రవి సింగ్ అనే చిరు హోటల్ నిర్వాహకుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం తన హోటల్లో మువ్వన్నెల దోసెల్ని వినియోగదారులకు అందించడం ద్వారా తన దేశభక్తిని చాటుకున్నారు.
* సెంచురీ స్టార్ శివరాజ్కుమార్ మైసూరులోని శక్తిధామలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొన్నారు. అక్కడ ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆశ్రమవాసులకు మిఠాయిల్ని పంచిపెట్టారు. వారిలో మరింత ఉత్సాహం కల్గించేందుకు అందరినీ బస్సులోకి ఆహ్వానించి.. స్వయంగా బస్సును నడిపి సంతోషం కల్గించారు.
* మండ్యలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గోపాలయ్య మాట్లాడుతూ రైతులకు అధిక ప్రయోజనాల్ని కల్గించే రెండు చక్కెర కర్మాగారాల్ని గానుగ ఆడేలా తగిన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. మైషుగర్స్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక లోక్సభ సభ్యురాలైన నటి సుమలత పాల్గొన్నారు. రేవు నగరి మంగళూరులో ఏర్పాటైన కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కృతుడు ఆమై మహాలింగప్పను జిల్లా ఇన్ఛార్జి మంత్రి సునిల్కుమార్ ఘనంగా సన్మానించారు.
ధార్వాడ : జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి ఆచార్ హాలప్ప
శివమొగ్గ : వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణగౌడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖËర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!