ప్రజలకు ఆరోగ్యరక్ష
ఆరోగ్య సూచికలో కర్ణాటకను ముందంజలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. ఆరు జిల్లాల్లో పౌష్ఠికాహార సమస్యలు తీవ్రంగా ఉన్నాయని గుర్తించి, పరిష్కరించేందుకు
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే : ఆరోగ్య సూచికలో కర్ణాటకను ముందంజలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. ఆరు జిల్లాల్లో పౌష్ఠికాహార సమస్యలు తీవ్రంగా ఉన్నాయని గుర్తించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది నాటికి నీతి ఆయోగ ఆరోగ్య జాబితాలో టాప్- 3 స్థానంలో ఉండడమే తక్షణ లక్ష్యమని తెలిపారు. బెంగళూరులో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతుండగా, మైసూరు, హాసన, దక్షిణ కన్నడ తదితర జిల్లాల్లో నిదానంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఒమిక్రాన్ కేసులు ఉన్నప్పటికీ ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య తక్కువేనన్నారు. కఠిన నియమావళిని అనుసరిస్తే మరో రెండు వారాల్లో కేసులు తగ్గుతాయని ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరు గ్రామీణ జిల్లాకు కొత్త జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రితో చర్చించి, నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రకటించారు. చిక్కబళ్లాపుర జిల్లా వ్యవహారాల బాధ్యతలు తప్పడంతో స్థానిక కార్యకర్తలు నిరాశకు గురయ్యారని తెలిపారు. పార్టీ తీసుకునే నిర్ణయాలకు నాయకులు అందరూ కట్టుబడడం తప్పనిసరి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా