మురిసిన కృషివిజ్ఞాన కేంద్రం!
కేంద్ర సర్కారు మంగళవారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో బెంగళూరులోని వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయ అనుబంధ గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే) పూర్వ విద్యార్థులే కావడంతో ఆ ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వీరిలో ఒకరు పద్మభూషణ్ గ్రహీత
బెంగళూరులోని గాంధీ కృషి విజ్ఞానకేంద్రం ఆవరణ
ఈనాడు డిజిటల్, బెంగళూరు : కేంద్ర సర్కారు మంగళవారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో బెంగళూరులోని వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయ అనుబంధ గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే) పూర్వ విద్యార్థులే కావడంతో ఆ ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వీరిలో ఒకరు పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ కృష్ణ ఎల్ల.. మరొకరు పద్మశ్రీ గ్రహీత ఆచార్య సుబ్బణ్ణ అయ్యప్పన్. సుబ్బణ్ణ అయ్యప్పన్ ఫిషరీస్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ చేశారు. డాక్టర్ కృష్ణ ఎల్ల ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) విద్య ఇదే ఆవరణలో పూర్తి చేశారు. ఒకే ఏడాది ఇద్దరు పూర్వ విద్యార్థులు భారతీయ అత్యున్నత పౌరపురస్కారాలు దక్కించుకోవటంపై బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. భారత్ బయోటెక్ అధినేతగా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన డాక్టర్ కృష్ణ ఎల్ల, కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి సుబ్బణ్ణ అయ్యప్పన్ వ్యాపార, వ్యవసాయ పరిశోధనల్లో భావితరానికి మార్గదర్శకులని ఆ విశ్వవిద్యాలయం ప్రకటించింది.
విశ్వవిద్యాలయానికే గర్వకారణం
డాక్టర్ కృష్ణ ఎల్ల, ఆచార్య అయ్యప్పన్ వారివారి రంగాల్లో విశిష్ట సేవలు అందించారు. డాక్టర్ కృష్ణ ఎల్ల ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రించే టీకా తయారు చేసి భారతీయ పరిశోధన సామర్థ్యాన్ని జగతికి చాటారు. పూర్వ విద్యార్థిగా ఆయన జీకేవీకే విద్యార్థులకు ఇచ్చే సందేశాలు నిత్యం స్ఫూర్తి నింపుతుంటాయి. ఆచార్య అయ్యప్పన్ చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చేపట్టిన పరిశోధనలు భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల స్థాయిని పెంచాయి. వీరిని పద్మపురస్కారాలతో సత్కరించటం మా విశ్వవిద్యాలయానికి గర్వకారణం. వీరిద్దరి సాధనలు వ్యవసాయ విద్యపై యువత ఆసక్తిని మరింత పెంచుతాయి. త్వరలో విశ్వవిద్యాలయం తరపున వీరిద్దనీ ఘనంగా సత్కరిస్తాం. -డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఉపకులపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
బర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు