అన్నీ ఒమిక్రాన్ వేరియంట్లే
కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య మరికొంత పెరిగింది. ఫిబ్రవరి రెండో వారం వరకు కేసుల తీవ్రత ఇలాగే ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. నమోదవుతున్న కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్లేనని జీనోమ్ సీక్వెన్సింగ్లో తేటతెల్లమవుతోంది. కొవిడ్ నియంత్రణలో
బళ్లారిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సిబ్బంది కరోనా నియంత్రణ చర్యలు
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య మరికొంత పెరిగింది. ఫిబ్రవరి రెండో వారం వరకు కేసుల తీవ్రత ఇలాగే ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. నమోదవుతున్న కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్లేనని జీనోమ్ సీక్వెన్సింగ్లో తేటతెల్లమవుతోంది. కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందని గణతంత్ర వేడుకల ప్రసంగంలో గవర్నర్ గహ్లోత్ పేర్కొన్నారు. మరో నాలుగు వారాల్లో కరోనాతో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరోనాతో మరణించిన వారి గణాంకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాచిపెట్టి తప్పుడు గణాంకాలను విడుదల చేశాయని పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ ఆరోపించారు. కర్ణాటకలో నాలుగు లక్షల మంది కరోనాతో మరణించారని, వారందరికీ పరిహారాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తాజా కేసులివీ..
కర్ణాటకలో తాజాగా 48,905 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిలో 41,699 మంది పూర్తిగా కోలుకున్నారు. చికిత్స పొందుతూ 39 మంది మరణించారు. క్రియాశీలక కేసుల సంఖ్య 3,57,909కు చేరుకున్నాయి. పాజిటివిటీ 22.51 శాతం, మరణాలు 0.07 శాతంగా నమోదయ్యాయి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన 143 మందితో కలిపి 627 మంది ప్రయాణికులకు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెక్పోస్టుల వద్ద 2.17 లక్షల మందికి స్వాబ్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 1.93 లక్షల మంది టీకా వేయించుకున్నారు.
గౌరవ్గుప్తా
పాలికె ముఖ్యాధికారికి పాజిటివ్
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : బృహత్ బెంగళూరు మహానగర పాలికె ముఖ్య కమిషనర్ గౌరవ్గుప్తాకు బుధవారం కరోనా సోకింది. వైద్యుల సూచనతో ఆయన హోం ఐసోలేషన్లో విశ్రాంతికి కదిలారు. ఇటీవల తనను కలిసిన వ్యక్తులంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల కిందట మాణిక్షా సైనిక స్మారక మైదానంలో పోలీసు కమిషనర్ కమల్పంత్, జిల్లాధికారి మంజునాథ్, సంయుక్త కమిషనర్ రవికాంతేగౌడ తదితరులతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి హాజరైన అధికారులు, పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కాదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు