అపూర్వం.. అనంత ప్రేరణ
కర్ణాటకకు సంబంధించిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు దివంగత కేంద్ర మంత్రి అనంతకుమార్ బతికున్న రోజుల్లో చట్టసభల్లో తన వాణిని వినిపించేవారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై నివాళులర్పించారు. జయనగరలో అనంతకుమార్ వినియోగించుకున్న కార్యాలయాన్ని ‘అనంత ప్రేరణ కేంద్రం’గా కుటుంబ సభ్యులు తీర్చిదిద్దారు
అనంతకుమార్ చిత్రం వద్ద గవర్నర్ థావర్చంద్ గహ్లోత్, ముఖ్యమంత్రి బొమ్మై తదితరులు
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : కర్ణాటకకు సంబంధించిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు దివంగత కేంద్ర మంత్రి అనంతకుమార్ బతికున్న రోజుల్లో చట్టసభల్లో తన వాణిని వినిపించేవారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై నివాళులర్పించారు. జయనగరలో అనంతకుమార్ వినియోగించుకున్న కార్యాలయాన్ని ‘అనంత ప్రేరణ కేంద్రం’గా కుటుంబ సభ్యులు తీర్చిదిద్దారు. ఆయన వినియోగించిన వస్తువులు, ప్రసంగ ప్రతులు, ఛాయాచిత్రాలను ఈ కేంద్రంలో ఆవిష్కరించారు. గరవ్నర్ థావర్చంద్ గహ్లోత్తో కలిసి ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి బొమ్మై శుక్రవారం ప్రారంభించారు. బెంగళూరు మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయం, హుబ్బళ్లిలో నైరుతి రైల్వే జోన్, ఎగువ కృష్ణా ప్రాజెక్టులతో పాటు, కావేరి జల వివాదాన్ని తీవ్రం కాకుండా అనంతకుమార్ తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తనకు అత్యంత ఆత్మీయ స్నేహితునిగా ఉన్నారని, ఆయన ఏ ఉన్నత స్థానానికి ఎదిగినా స్నేహంలో మార్పు రాలేదని చెప్పారు. ప్రజా పోరాటాల్లో ముందుంటూ, ఇతరులనూ ప్రోత్సహించేవారని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ, ఏబీవీపీ, భాజపాల్లో తనదైన చెరగని ముద్ర వేసిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా నిలిచారని కొనియాడారు. అనంతకుమార్తో కలిసి ఒకే కళాశాలలో చదువుకున్నానని, ఎవరు ముందుగా వెళితే వారు బెంచీని మరొకరి కోసం రిజర్వు చేసి ఉంచే వారిమని గుర్తు చేసుకున్నారు. అత్యవసర పరిస్థితిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులను చేర్చడంలో జరిగిన లాఠీఛార్జ్లో ఆయన దెబ్బలు తిన్నారని తెలిపారు. అప్పుడు అరెస్టు కావడంతో ఒక ఏడాది కళాశాలకు దూరమయ్యారని గతాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో కొనసాగుతూనే హాస్య ప్రజ్ఞ కలిగి ఉన్న అనంతకుమార్కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని వివరించారు. అనంతకుమార్ వినియోగించిన వస్తువులను ఈ కేంద్రంలో ఉంచారు. తనకు, అనంతకుమార్కు ఉన్న అనుబంధాన్ని గవర్నర్ గహ్లోత్, ఇతర నాయకులు ఇదే సందర్భంలో గుర్తు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!