వారంతా.. చదువలమ్మ వారసులు
కనీవినీ ఎరుగని రీతిలో పదో తరగతి పరీక్షల్లో వారంతా రాణించారు. 625 మార్కులకు 625 సాధించి సరస్వతికి అసలైన వారసులుగా నిలిచారు. తొలిసారిగా రాష్ట్రంలో ఏకంగా 145 మందికి ఆ ఘనత లభించింది. అలాంటి వారిలో వీరు కొందరు. పరీక్షా ఫలితాల్ని ప్రకటించగానే వందశాతం మార్కులను
హావేరి జిల్లా హళేమన్నంగి : రైతుబిడ్డ ప్రవీణ్ బసనగౌడతో తల్లిదండ్రుల సంబరం
బెంగళూరు (ఎలక్ట్రానిక్ సిటీ), న్యూస్టుడే : కనీవినీ ఎరుగని రీతిలో పదో తరగతి పరీక్షల్లో వారంతా రాణించారు. 625 మార్కులకు 625 సాధించి సరస్వతికి అసలైన వారసులుగా నిలిచారు. తొలిసారిగా రాష్ట్రంలో ఏకంగా 145 మందికి ఆ ఘనత లభించింది. అలాంటి వారిలో వీరు కొందరు. పరీక్షా ఫలితాల్ని ప్రకటించగానే వందశాతం మార్కులను సాదించినట్లు తెలియజేయడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. వీరిలో మరో విశేషం కూడా దాగి ఉంది. ఈ ఘనత సాధించిన వారిలో అధికశాతం మంది సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారు. అంతేకాదండోయ్! అనేకమంది ప్రభుత్వ పాశశాలల్లో చదివినవారే. వీరు సాధించిన ఈ ఘనత ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు చూసేవారికి కనువిప్పు కల్గిస్తుందని విద్యావేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సప్లిమెంటరీ పరీక్షలు..
బెంగళూరు (శివాజీనగర): పదో తరగతి పరీక్షల ఫలితాలతో పాటే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఎస్ఎస్ఎల్సీ బోర్డు ప్రకటించింది. జూన్ 27 నుంచి జులై 4 వరకు ఇవి ఉంటాయని అధికారులు తెలిపారు. మే 30లోగా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ విద్యాసంవత్సరం, గతంలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్ఛు జూన్ 27న సైన్సు, పొలిటికల్ సైన్సు, కర్ణాటక/ హిందూస్తానీ సంగీతం, జూన్ 28న ప్రథమ భాష (కన్నడ, తెలుగు, హిందీ, మరాఠి, తమిళం, ఉర్దూ, సంగీతం, ఆంగ్లం, సంస్కృతం), జూన్ 29న ద్వితీయ భాష (ఆంగ్లం, కన్నడం), జూన్ 30న సోషల్ సైన్స్, జులై 1న తృతీయ భాష (హిందీ, కన్నడ, ఆంగ్లం, అరబిక్, పర్షియన్, ఉర్దూ, సంస్కృతం, కొంకణి, తుళు), జులై 2న ఆర్థిక శాస్త్రం, జులై 4- గణితం, సైన్సు పరీక్షలు ఉంటాయి. ఒక సబ్జెక్ట్కు రూ.370, రెండింటికి రూ.461, మూడు లేదా అంతకు మించిన సబ్జెక్టులకు రూ.620 చెల్లించాలని అధికారులు సూచించారు.
బెళగావి : అమోఘ్ కౌశికను అభినందిస్తున్న తల్లిదండ్రులు
కుందాపుర తాలూకా కాళవారకు చెందిన నిశా
హావేరి జిల్లా గురుభవన్ కాపలాదారుడు బసవరాజ్ శేతసనది కుమార్తె మధు శేతసనది
చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా కబ్బళ గ్రామానికి చెందిన కె.ఎం.సించనా
విజయపుర జిల్లా కారజోళ రాణి చెన్నమ్మ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని స్వాతి మాళేద
తల్లిదండ్రులతో విద్యార్థిని ఏక్తా
విజయపుర జిల్లా జుమనాళ నివాసి అమిత్కు మిఠాయిల్ని తినిపిస్తున్న బంధువులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖËర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’