logo

ఘనంగా సోమనాథస్వామి పట్టాధికార వేడుక

మూడోమైలు క్యాంపులోని కరిబసవనగర్‌ రంభాపురి శాఖామఠంలో సోమనాథ శివాచార్యుల 15వ పట్టాధికార మహోత్సవం గురువారం వేడుకగా సాగింది. రోజంతా కార్యక్రమాలన్నీ రంభాపురి జగద్గురువులు సమక్షంలోనే జరిగాయి. వేడుకలో భాగంగా గురువారం పట్టణ స్త్రీశక్తి భవన్‌ నుంచి జలసంరక్షణ నినాదంగా వాకథాన్‌ జరిగింది.

Published : 20 May 2022 02:13 IST

రంభాపురి జగద్గురువు నుంచి సేవారత్న పురస్కారం స్వీకరిస్తున్న ప్రముఖ వైద్యులు శివరాజ్‌

సింధనూరు:మూడోమైలు క్యాంపులోని కరిబసవనగర్‌ రంభాపురి శాఖామఠంలో సోమనాథ శివాచార్యుల 15వ పట్టాధికార మహోత్సవం గురువారం వేడుకగా సాగింది. రోజంతా కార్యక్రమాలన్నీ రంభాపురి జగద్గురువులు సమక్షంలోనే జరిగాయి. వేడుకలో భాగంగా గురువారం పట్టణ స్త్రీశక్తి భవన్‌ నుంచి జలసంరక్షణ నినాదంగా వాకథాన్‌ జరిగింది. ఎమ్మెల్యే నాడగౌడ, మాజీ శాసనసభ్యుడు బాదర్లి హంపనగౌడ, సమాజ సేవకుడు డాక్టర్‌.చన్ననగౌడ, నాయకులు బసనగౌడ బాదర్లి, కె.కరియప్ప పాల్గొన్నారు. ప్రముఖ వైద్యులు శివరాజ్‌, శాశ్వతయ్యస్వామి ముక్కుందిమఠ, నెక్కంటి సురేశ్‌, లీలా మల్లికార్జున్‌, చన్నబసయ్య సేవా ప్రశస్తిలను జగద్గురువుల చేతుల మీదుగా అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని