logo

అదుపుతప్పి గోదామును ఢీకొన్న బస్సు

బైకును తప్పించబోయే ప్రయత్నంలో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ఓ గోదామును ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం ఉదయం కూడ్లిగి తాలూకా శివపురలో చోటుచేసుకుంది. హొసపేటె నుంచి కూడ్లిగి వెళ్తున్న ఆర్టీసీ బస్సు శివపుర

Published : 20 May 2022 02:13 IST

హొసపేటె, న్యూస్‌టుడే: బైకును తప్పించబోయే ప్రయత్నంలో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ఓ గోదామును ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం ఉదయం కూడ్లిగి తాలూకా శివపురలో చోటుచేసుకుంది. హొసపేటె నుంచి కూడ్లిగి వెళ్తున్న ఆర్టీసీ బస్సు శివపుర సమీపించగానే ఎదురుగా బైకు అడ్డు వస్తున్న క్రమంలో దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న ఎరువుల గిడ్డంగిని ఢీకొని ఆగిపోయింది. బస్సు చోదకుడు సిద్దప్ప, కండక్టర్‌ కొట్రేశ్‌, మరో ప్రయాణికుడికి గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని