విస్తరణ ఊసే లేదాయె
దిల్లీ పర్యటన సందర్భంగా అధినాయకులతో ఏ విషయాలూ చర్చించలేదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం పేరిట శుక్రవారం రాత్రి దిల్లీకి తరలిన విషయం తెలిసిందే
ఇక ఎన్నికలపైనే దృష్టి : బొమ్మై
బసవరాజ బొమ్మై
ఈనాడు, బెంగళూరు : దిల్లీ పర్యటన సందర్భంగా అధినాయకులతో ఏ విషయాలూ చర్చించలేదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం పేరిట శుక్రవారం రాత్రి దిల్లీకి తరలిన విషయం తెలిసిందే. అక్కడ షా అందుబాటులో లేకపోవటంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్ సింగ్తో మాత్రమే చర్చలు జరిపారు. అమిత్ షా సూచన మేరకు ఇటీవలి కోర్ కమిటీలో చర్చించిన విషయాలను అరుణ్సింగ్ ఫోన్లో విశ్లేషించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
ఆ ఊసు లేనట్లే
గడచిన పది రోజుల్లో రెండో సారి దిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ఎంతో ప్రయత్నించారు. గతవారం దిల్లీకి వెళ్లిన సమయంలో.. రెండు రోజుల్లో విస్తరణ ప్రక్రియపై స్పష్టత వస్తుందని కూడా చెప్పారు. ఆలోగా బీబీఎంపీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఏడు విధాన పరిషత్తు నియోజకవర్గాలకు- నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఈ ఎన్నికలపై అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనివార్యంగా మారింది. గతవారం బెంగళూరులో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలోనూ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో తీర్మానించిన పేర్లను ముఖ్యమంత్రి దిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఎన్నికలపై అరుణ్సింగ్తో చర్చించిన అంశాలను త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చింనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మే 24, రాజ్యసభ ఎన్నికలకు మే 31న నామినేషన్లకు తుది గడువు. ఈలోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించనున్నట్లు బొమ్మై శనివారం వెల్లడించారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై చర్చించబోమని స్పష్టం చేశారు. విస్తరణ ప్రక్రియ పార్టీ అంతర్గత వ్యవహారం.. రాజకీయ పరిణామాలు కీలకమైన దశలో వీటిని వాయిదా వేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
వేగంగా పరిహారం
దిల్లీలో అరుణ్సింగ్తో ఫోన్లో మాట్లాడాక ముఖ్యమంత్రి బెంగళూరుకు పయనమయ్యారు. ఈ సందర్భంగా బొమ్మై మాట్లాడుతూ బెంగళూరుతో పాటు వివిధ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ నేతృత్వంలో పరిహారం గురించి డేటా రూపొందించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం తాను బెంగళూరులో పర్యటించి వర్ష ప్రభావంపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించినట్లు చెప్పారు. సాయంత్రానికి బెంగళూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం కృష్ణాలో జిల్లాధికారులు, జిల్లా పంచాయతీ సీఈఓలతో సమావేశమై వర్షాలపై చర్చించారు.
దావోస్కు ప్రయాణం
దావోస్లో నిర్వహించే ప్రపంచ ఆర్థిక సమాఖ్య (డబ్ల్యుఈఎఫ్) సమావేశానికి ముఖ్యమంత్రి బొమ్మై హాజరుకానున్నారు. ఆయన ఆదివారం ఉదయం దావోస్కు బయలుదేరుతారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈనెల 22 నుంచి 26 వరకు కొనసాగే సమావేశానికి ముఖ్యమంత్రి 23, 24 తేదీల్లో మాత్రమే హాజరవుతారు. 25న స్విట్జర్లాండ్ నుంచి బయలుదేరి.. దుబాయి మీదుగా ఈనెల 26న బెంగళూరుకు చేరుకుంటారు. బీబీఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల కారణంగా ముఖ్యమంత్రి దావోస్ ప్రయాణంపై సందిగ్ధత నెలకొన్నా.. నవంబరులో కర్ణాటకలో నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం(జిమ్) కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక వేత్తలతో సమావేశం కావాల్సి ఉండటంతో దావోస్కు వెళ్లేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి దావోస్ ఆహ్వానం అందుకున్న ఇద్దరు ముఖ్యమంత్రుల్లో బసవరాజ బొమ్మై కూడా ఒకరు కావటంతో ఈ పర్యటనను కొనసాగించేందుకే ఆయన ఆసక్తి చూపారు.
అరుణ్సింగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాతో పోటీ.. హామీలు గ్యారంటీ
[ 18-04-2024]
కర్ణాటకలో గ్యారంటీలను సజావుగా అమలు చేశామన్న ధీమాతో కాంగ్రెస్ దేశప్రజలకు అదే స్థాయి హామీలిచ్చింది. ఇప్పటికే 25 గ్యారంటీలతో ఎన్నికల ప్రణాళిక ప్రకటించిన కాంగ్రెస్ వాటిపై రాష్ట్ర ప్రచారంలో మరింత వివరణ ఇచ్చింది. -
భాజపాకు గ్యారంటీల భయం.. హస్తానికదే అభయం
[ 18-04-2024]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలు కొట్టుకుని పోతాయని ప్రచారంలో ముందుకు వెళ్తున్న భాజపాకు ఎక్కడో అదే గ్యారంటీల భయం వెంటాడుతోందని సర్వత్రా చర్చనీయాంశమైంది. -
విద్యానగరిలో స్వతంత్రుడి సెగ?
[ 18-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలో అనుభవం కలిగిన నాయకుడు ప్రహ్లాద్ జోసి- యువనేత వినోద్ అసూటి మధ్య మధ్య పోటీ రసవత్తరంగా మారింది. -
పంచభూతాల్లో లీనమైన ద్వారకీశ్
[ 18-04-2024]
గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించిన సీనియరు నటుడు, దర్శకుడు, నిర్మాత- ద్వారకీశ్ భౌతికకాయానికి చామరాజపేట టీఆర్ మిల్ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం పోలీసు గౌరవ లాంఛనాలతో- కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించారు. -
డీకేపై గౌడ తీవ్ర ఆరోపణ
[ 18-04-2024]
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆస్తి కోసం ఒక తొమ్మిదేళ్ల బాలికను అపహరించారని మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ మంగళవారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
కరడికి చేయందించిన కాంగ్రెస్
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై, మంగళవారం లోక్సభ సభ్యత్వానికి- భారతీయ జనతాపార్టీకీ రాజీనామా చేసిన కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ బుధవారం బెంగళూరులో కాంగ్రెస్లో చేరారు. -
మోదీ సభకు సకల సన్నాహాలు
[ 18-04-2024]
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించే బహిరంగలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజె వెల్లడించారు. -
భాజపాను బలపరుద్దాం
[ 18-04-2024]
మాదిగ సముదాయ ప్రజలందరం భాజపాను బలపరుద్దామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. చెళ్లకెర వాసవీ కల్యాణ మంటపంలో బుధవారం జరిగిన మాదిగ సముదాయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మంత్రి మల్లికార్జున ప్రచారం
[ 18-04-2024]
బోవి గురుపీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున వివిధ పీఠాధిపతులను కలిసి లోక్సభ ఎన్నికల్లో దావణగెరె కాంగ్రెస్ అభ్యర్థి డా.ప్రభ మల్లికార్జునకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
భాజపా రామాలయం నిర్మిస్తే.. మేం రామరాజ్యమే తెస్తాం
[ 18-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామరాజ్యమే నిర్మిస్తామని బళ్లారి జిల్లా మంత్రి బి.నాగేంద్ర స్పష్టం చేశారు. జూన్ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పతనమవుతుంది. -
యూట్యూబర్ దుస్సాహసం
[ 18-04-2024]
బెంగళూరు నగర శివారు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై వీడియో చిత్రీకరించి, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ వికాస్ గౌడను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కుమారస్వామి స్పష్టీకరణ
[ 18-04-2024]
తాను ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఉంటే సంకీర్ణ ప్రభుత్వం పతనమయ్యేది కాదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు.