logo

కమనీయం.. శ్రీనివాసుని కల్యాణం

సంగనకల్లు గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా రెండోరోజు శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. పూర్ణకుంభాలతో స్వామి వార్లకు స్వాగతం పలికారు. ఉభయ దేవేరుల సమేత శ్రీనివాసుడి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలతో అలంకరించారు.

Published : 22 May 2022 01:55 IST

సంగనకల్లు వేంకటేశ్వరస్వామికి పుష్పాలంకరణ

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే : సంగనకల్లు గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా రెండోరోజు శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. పూర్ణకుంభాలతో స్వామి వార్లకు స్వాగతం పలికారు. ఉభయ దేవేరుల సమేత శ్రీనివాసుడి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలతో అలంకరించారు. పరిణయ మండపంలో శాస్త్రోక్తంగా శ్రీదేవి, భూదేవి, సమేత శ్రీనివాసుడి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. మంగళవాద్యాలు, వేదమంత్రాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు అన్నమయ్య కీర్తనలు, గోవిందనామాలు పఠించారు. స్వామి వార్లను అలంకరించి ఆనంద మండపంలో విశేష పూజలు చేశారు. భక్తులు పెద్తఎత్తున పాల్గొని కల్యాణం తిలకించారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన ధర్మకర్త గోవిందరాజులు శెట్టి, సునీల్‌, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

శ్రీనివాసుడి కల్యాణంలో పాల్గొన్న భక్తులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని