Cheating: ఆమె మామూలు ఆంటీ కాదు.. ఫేస్బుక్లో ‘ఘాటు ప్రేమ’ కాటు!
మన్మథుడు సైతం చిన్నబోయేలా ఫేస్బుక్ ద్వారా చిలిపి సందేశాల్ని పంపుకొన్నారు. ఆమెను తలచుకోనిదే ఒక్క క్షణమైనా గడవని పరిస్థితులకు ఆ యువకుడు చేరుకున్నాడు. ఈ జీవితానికి తన అర్ధాంగి ఆమేనని అందరికీ తేల్చిచెప్పేశాడు. అందుకు
మండ్య, న్యూస్టుడే: మన్మథుడు సైతం చిన్నబోయేలా ఫేస్బుక్ ద్వారా చిలిపి సందేశాల్ని పంపుకొన్నారు. ఆమెను తలచుకోనిదే ఒక్క క్షణమైనా గడవని పరిస్థితులకు ఆ యువకుడు చేరుకున్నాడు. ఈ జీవితానికి తన అర్ధాంగి ఆమేనని అందరికీ తేల్చిచెప్పేశాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. పెళ్లి ఖర్చులకంటూ ఆమె పినతల్లి ద్వారా రూ.3.50 లక్షలను సర్దుబాటు చేశాడు. ఇంతకూ పెళ్లి పీటల మీదకు వచ్చే సరికి కంగుతినడం ఆ యువకుడి వంతైంది. తను ప్రేమించిన అసలైన ఆ కలల రాణికి అక్షరాలా 50 సంవత్సరాలని తెలిసి గుడ్లు తేలేశాడు. పినతల్లిగా నాటకమాడిన మహిళే ఫేస్బుక్లో పరిచయమైన తన కలలరాణి అని తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యాడు. కర్ణాటకలోని మండ్య జిల్లాలోని నాగమంగల తాలూకాలో జరిగిన యథార్థ సంఘటన ఇదీ.
ఆలస్యంగా వెలుగుచూసిన ఆ సంఘటన వివరాల్లోకెళ్తే.. నాగమంగళ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఫేస్బుక్ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె తన ఫొటోను కూడా పంపింది. ఇద్దరి నడుమ కొనసాగిన చిరు సందేశాలు చివరకు ప్రేమగా మారాయి. తనను చూసేందుకు ఎప్పుడూ రావద్దని ఆమె చెప్పేది. తన తల్లిదండ్రులకు ఇష్టంలేదని వివరణ ఇచ్చేది. పెళ్లికి ఆ యువకుడు ఒత్తిడి చేయడంతో మాట్లాడేందుకు పినతల్లిని పంపుతున్నట్లు చెప్పింది. అనుకున్నట్లుగానే యువకుడి ఇంటికి పినతల్లి వచ్చింది. అందరితో కలుపుగోలుగా మాట్లాడింది. ఇంట్లోవారికి తెలియకుండా ఆ యువకుడు రూ.3.50 లక్షలను ఆమెకు అందించాడు. అనుకున్నట్లుగానే పెళ్లి ఖరారైంది.
ఆదిచుంచనగిరి మఠంలో వివాహాన్ని నిర్ణయించారు. పెళ్లికి వచ్చిన ఆ వయస్సు మళ్లిన మహిళ గత రాత్రే ఆ యువతిని కొందరు అపహరించారని ఓ కథను వినిపించింది. దీన్ని విన్న తరువాత ఆ యువకుడు, అతని తల్లిదండ్రులకు అనుమానమొచ్చింది. వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు. తమదైన శైలిలో దర్యాప్తును చేపట్టిన పోలీసులకు అసలు యువతి అనేదే ఈ ఘట్టంలో లేదని, ఆమే యువతిగా మరొకరి ఫొటో పంపినట్లు అంగీకరించింది. అంతేకాకుండా.. యువకుడి నుంచి తీసుకున్న రూ.3.50 లక్షలను వెనక్కు ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలారు బాటలో కల్లోలం
[ 28-03-2024]
రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అనూహ్యంగా ఎదురైన ఆ ఘట్టం అధికార కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. ఇలాంటి వ్యవహారమే మునుపు.. 2019 జులై 5వ తేదీన తలెత్తింది. -
చిత్రదుర్గ బరిలో కారజోళ!
[ 28-03-2024]
రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను భాజపా వెల్లడించింది. -
అక్రమార్కుల నివాసాలపై దాడులు
[ 28-03-2024]
ఆదాయంతో పొంతన లేని ఆర్జన కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. -
వికసిత భారత్ సాధనే లక్ష్యం
[ 28-03-2024]
దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గద్దెనెక్కాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర పేరొన్నారు. -
హృదయం లేని మోదీ
[ 28-03-2024]
కర్ణాటకలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంటామన్న భయంతోనే భాజపా- జనతాదళ్ పొత్తు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. -
ఉత్కంఠంగా విద్యావర్ధక సంఘం ఎన్నికలు
[ 28-03-2024]
వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్, కార్యదర్శిగా అరవింద్ పాటీల్లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు. -
అక్రమ తరలింపులపై దాడులు
[ 28-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇంటిపై, రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3.52 లక్షలు విలువ చేసే 842.72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
తిప్పేరుద్రస్వామి తిరునాలకు పోటెత్తిన భక్తులు
[ 28-03-2024]
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి తిరునాళ్లకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు. -
ఎన్ఐఏ విస్తృత దాడులు
[ 28-03-2024]
రాజధాని నగరంలోని బ్రూక్ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడు దర్యాప్తులో భాగంగా శివమొగ్గ, బెంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, చెన్నైలలో బుధవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు దళం (ఎన్ఐఏ) అధికారులు దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ