కపట నాటక పాత్రధారి
తమ వివాహేతర సంబంధానికి బిడ్డ అడ్డుగా ఉందనే ఉద్దేశంతో పరాయి బిడ్డగా నమ్మించే యత్నంలో ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయిన సంఘటన మైసూరు నగరం లష్కర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అలా నమ్మించేందుకు ప్రయత్నించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రియురాలి బిడ్డనే పరాయిబిడ్డ అని పోలీసు స్టేషన్ చేరిన రఘు (పాతచిత్రం)
మైసూరు, న్యూస్టుడే : తమ వివాహేతర సంబంధానికి బిడ్డ అడ్డుగా ఉందనే ఉద్దేశంతో పరాయి బిడ్డగా నమ్మించే యత్నంలో ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయిన సంఘటన మైసూరు నగరం లష్కర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అలా నమ్మించేందుకు ప్రయత్నించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. జిల్లాలోని హెచ్.డి.కోటె తాలూకాకు చెందిన రఘు అనే వ్యక్తి రెండు వారాల కిందట రాయచూరు బస్టాండ్లో బస్సుకోసం వేచి ఉన్న సమయంలో ఓ మహిళ చిన్నారిని తీసుకొచ్చి మరుగుదొడ్డికి వెళ్లాలంటూ ఇచ్చి వెళ్లిందట. రెండు గంటలైనా ఆమె రాకపోయేసరికి మైసూరుకు రావాల్సి ఉన్నందున బయలుదేరి మైసూరు చేరుకున్నానని ఆ వ్యక్తి వివరించాడు. వెంటనే లష్కర్ పోలీసు స్టేషన్లో సంఘటన వివరాలు తెలిపి బిడ్డను అప్పగించాడు. ఆ మగబిడ్డను స్వాధీనం చేసుకుని బాల వికాస కేంద్రానికి తరలించిన పోలీసులు.. కేసు దర్యాప్తును చేపట్టారు. రఘును మరింత లోతుగా విచారించేసరికి అతని ప్రేమ పురాణం బయటపడింది. అప్పటికే భర్త నుంచి దూరంగా ఉంటూ వచ్చిన ఓ మహిళతో రఘుకు పరిచయమైంది. ఆమెకు అప్పటికే ఓ మగబిడ్డ ఉండడంతో అడ్డుగా ఉన్నాడని భావించి వదిలించుకునే ప్రయత్నం చేశాడని దర్యాప్తులో వెల్లడైంది. అందులో భాగంగానే పై నాటకమంతా ఆడినట్లు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.