తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు
తీర ప్రాంతాలు మినహా ఇతర ప్రదేశాల్లో సోమవారం దాదాపు పొడి వాతావరణం కొనసాగింది. సాగర తీర ప్రాంతాల్లో ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు సమాచారం అందింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు వివిధ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
జలాశయాలకు కొనసాగుతున్న వరద
రామనగర జిల్లాలోని ఇగ్గలూరు బ్యారేజ్ నుంచి విడుదలవుతున్న నీరు
బెంగళూరు (ఎలక్ట్రానిక్ సిటీ), న్యూస్టుడే : తీర ప్రాంతాలు మినహా ఇతర ప్రదేశాల్లో సోమవారం దాదాపు పొడి వాతావరణం కొనసాగింది. సాగర తీర ప్రాంతాల్లో ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు సమాచారం అందింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు వివిధ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయానికి ఒకేరోజులో ఐదు టీఎంసీల నీరు చేరగా.. ఆలమట్టి జలాశయానికి రెండున్నర టీఎంసీల నీరు వచ్చింది. వివిధ జలాశయాలకు చేరుతున్న ఇన్ఫ్లోల విషయానికొస్తే... నారాయణపుర- 18,445 క్యూసెక్కులు, ఆలమట్టి- 42,973, కబిని 2,947, కేఆర్ఎస్- 12,488, హేమావతి- 3,332 క్యూసెక్కుల నీరు చేరుతోందని జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు. ఇతర అనేక చిన్నతరహా బ్యారేజ్లు భర్తీ కావడంతో నీటి విడుదల కొనసాగుతోందని చెప్పారు.
మంగళూరులో సోమవారం అత్యధికంగా ఎనిమిది సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మాణి, సిద్ధాపుర 6, విట్ల 5, పుత్తూరు 4, కద్ర 3, సుళ్య, భాగమండల, సంపాజె 2, ధర్మస్థల, ముల్కి, బెళ్తంగడి, పణంబూరు, శిరాళి, అంకోలా, తుమ్రి, ముర్నాడులో ఒక సెంటీమీటరు వర్షం కురిసింది. రాబోయే రెండు రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు