‘కాషాయదండు లూటీ పర్వం’
కరోనా పేరుతో భాజపా పాలకులు దాదాపు రూ.2000 కోట్లు లూటీ చేశారని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపించారు. బెంగళూరు జయనగరలో సోమవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. యడియూరప్ప పాలనావధిలో మంత్రి రమేష్ జార్ఖిహొళి ఎందుకు రాజీనామా చేశారో ప్రజలందరికీ తెలుసున్నారు
సిద్ధరామయ్య, బీకే హరిప్రసాద్, రామలింగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన జయనగర ప్రాంత నేతలు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : కరోనా పేరుతో భాజపా పాలకులు దాదాపు రూ.2000 కోట్లు లూటీ చేశారని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపించారు. బెంగళూరు జయనగరలో సోమవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. యడియూరప్ప పాలనావధిలో మంత్రి రమేష్ జార్ఖిహొళి ఎందుకు రాజీనామా చేశారో ప్రజలందరికీ తెలుసున్నారు. మొన్నటికి మొన్న కె.ఎస్.ఈశ్వరప్ప ‘40 శాతం కమీషన్’ కోసం డిమాండు చేయడంతోనే ఓ గుత్తేదారు ఆత్మహత్య చేసుకున్నాక.. పదవి వదులుకోక తప్పలేదన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇవ్వలేదన్నారు. ఆ పార్టీ నేతలు రూ.500 కోట్లు వ్యయం చేసి 17 మంది శాసనసభ్యులను ‘ఆపరేషన్ కమల’ పేరిట కొనుగోలు చేసి దొడ్డిదారి గుండా అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. పీఎస్ఐ నియామకాలకు అభ్యర్థుల నుంచి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. బెంగళూరు నగరంలో కురిసిన వర్షాలకు పలు ప్రదేశాలు ముంపుపాలైనా.. ఏలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తప్పుపట్టారు. రానున్న బెంగళూరు పాలికె ఎన్నికల్లో భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎగువ సభలో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్, పీసీసీ కార్యాధ్యక్షులు సలీం అహ్మద్, రామలింగారెడ్డి, శాసనసభ్యురాలు సౌమ్యరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జయనగర ప్రాంతానికి చెందిన పలువురు భాజపా, జేడీఎస్ కార్యకర్తలు సిద్ధరామయ్య సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM