logo

ఒకే కాన్పులో నలుగురు జననం

కెవ్వుమంటూ కేరింతలు కొడుతున్న ఆ పొత్తిళ్ల బిడ్డలను చూసి అందరూ సంబరపడిపోతున్నారు. ఒకే కాన్పులో ఏకంగా నలుగురు జన్మించారు. శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా తడసా గ్రామానికి చెందిన అల్మాజ్‌ బాను అనే మహిళ సోమవారం ఉదయం శివమొగ్గలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో నలుగురికి జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు.

Published : 24 May 2022 02:28 IST

చంటి బిడ్డలతో వొైద్యుల బృందం

శివమొగ్గ, న్యూస్‌టుడే : కెవ్వుమంటూ కేరింతలు కొడుతున్న ఆ పొత్తిళ్ల బిడ్డలను చూసి అందరూ సంబరపడిపోతున్నారు. ఒకే కాన్పులో ఏకంగా నలుగురు జన్మించారు. శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా తడసా గ్రామానికి చెందిన అల్మాజ్‌ బాను అనే మహిళ సోమవారం ఉదయం శివమొగ్గలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో నలుగురికి జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలున్నారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. వైద్య రంగంలో ఇది అరుదైన సంఘటనగా పేర్కొన్నారు. సాధారణంగా ప్రతీ 5.12 లక్షల మందిలో ఒకరికిలా జరుగుతుందని తెలిపారు. బిడ్డలను అనుక్షణం కనిపెట్టుకుని ఉంటున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని