త్వరలో.. గాడిద పాల కేంద్రం!
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరికొన్ని నెలల్లో రేవునగరి మంగళూరు సమీప గ్రామం రాష్ట్రంలోనే తొలి గాడిద పాల కేంద్రానికి వేదిక కానుంది. ఆరోగ్య సంరక్షణలో గాడిద పాలకు లభిస్తున్న విపరీతమైన డిమాండు నేపథ్యంలో శ్రీనివాసగౌడ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీన్ని బంట్వాళ తాలూకా మంచి గ్రామంలో నెలకొల్పుతున్నారు.
మంగళూరు శివార్లలో ఏర్పాట్లు
మంగళూరు, న్యూస్టుడే : అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరికొన్ని నెలల్లో రేవునగరి మంగళూరు సమీప గ్రామం రాష్ట్రంలోనే తొలి గాడిద పాల కేంద్రానికి వేదిక కానుంది. ఆరోగ్య సంరక్షణలో గాడిద పాలకు లభిస్తున్న విపరీతమైన డిమాండు నేపథ్యంలో శ్రీనివాసగౌడ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీన్ని బంట్వాళ తాలూకా మంచి గ్రామంలో నెలకొల్పుతున్నారు. వచ్చే నెల నుంచే అందుబాటులోకి తీసుకురావాలనేది ఆయన ఆలోచన. ఈ అవసరాలకే గుజరాత్ నుంచి మంచి శరీర పుష్టి కల్గిన 30 గాడిదలను తీసుకొచ్చారు.
రెండెకరాల విస్తీర్ణంలో తొలిదశలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. మంగళూరు ప్రాంతంతో పాటు దక్షిణ కన్నడ జిల్లాల్లో గాడిదల పెంపకానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లీటరు గాడిద పాలు రూ.10 వేల వరకు ధర లభిస్తోంది. విదేశాల్లో ఈ ధర మరింత అధికంగా ఉంటోందని నిర్వాహకులు తెలిపారు. మంగళూరు డెయిరీలో రోజుకు 10 లీటర్ల పాలను సంస్కరించి 100 మి.లీ, 200 మి.లీ. సీసాల్లో వినియోగదారులకు అందించాలనేది నిర్వాహకుల ఆలోచన. గాడిదలను పోషించే రైతులకు ప్రతి నెలా ఒక్కో గాడిద నుంచి రూ. 30 వేలకు పైగా ఆదాయాన్ని గడించవచ్చని శ్రీనివాసగౌడ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
బెంగళూరు ఉత్తరలో ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.