విద్యుత్తు కాంతి కిరణాలు
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు దారిపడుతున్నాయి. ముఖ్యమంత్రి బొమ్మై పాల్గొన్న తొలిరోజున లులు, హీరో మోటార్స్, హిటాచీ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. మంగళవారం ఇంధన రంగంలో విఖ్యాత సంస్థ రెన్యూ పవర్
గౌతమ్ అదానీకి రాష్ట్ర పథకాలను వివరిస్తున్న సీఎం
ఈనాడు, బెంగళూరు : దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు దారిపడుతున్నాయి. ముఖ్యమంత్రి బొమ్మై పాల్గొన్న తొలిరోజున లులు, హీరో మోటార్స్, హిటాచీ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. మంగళవారం ఇంధన రంగంలో విఖ్యాత సంస్థ రెన్యూ పవర్ రాష్ట్రంలో దాదాపు రూ.అర్ధ లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఏడేళ్ల కాలంలో సంప్రదాయేతర ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ యూనిట్లను రెండు దశల్లో స్థాపించేందుకు ఆసక్తి చూపింది. తొలి దశలో ఇప్పటికే అమలులో ఉన్న పథకాల్లో రూ.11,900 కోట్లను రానున్న రెండేళ్లలో, రెండో దశలో రూ.37,500 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ యూనిట్లను స్థాపించనుంది. ఈ రెండు దశల ప్రాజెక్టుల్లో కనీసం 30 వేల మందికి ఉపాధి లభిస్తుంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో 120కంటే అధిక పవన, సౌర, హైడ్రో ఇంధన ప్రాజెక్టులను స్థాపించిన రెన్యూ పవర్ సంస్థ రాష్ట్రంలోనూ 12 గిగా వ్యాట్ల ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఇదే అంశంపై సంస్థ అధ్యక్షులు సుమంత్ సిన్హా రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
మెగా డేటా సెంటర్
డేటా సెంటర్లో ఐదేళ్ల భారీ కార్యాచరణను రూపొందించిన రాష్ట్రానికి భార్తి ఎంటర్ప్రైజెస్ సంస్థ రూపంలో మరో మెగా సెంటర్ రూపుదిద్దుకోనుంది. ఈ సంస్థ అధ్యక్షులు సునీల్ భార్తి మిట్టల్ ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి బొమ్మైతో చర్చించారు.
భవనాల భద్రతా పరికరాలను ఆటోమేషన్ నియంత్రణ వ్యవస్థలతో రూపొందించే జాన్సన్ కంట్రోల్స్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. ఈ సంస్థ సీఈఓ జార్జ్ ఒలియర్తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.
అంతరిక్ష, భవన నిర్మాణ, ఆటోమేషన్ సాంకేతిక ఉత్పత్తుల తయారీ సంస్థ హనీవెల్ రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులు చేపట్టనుంది. ఈ సంస్థ ఉపాధ్యక్షుడు అమి చియాంగ్తో ముఖ్యమంత్రి బొమ్మై, పరిశ్రమల మంత్రి మురుగేశ్ నిరాణి భేటీ అయ్యారు. ఐదేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులను ‘బియాండ్ ద బెంగళూరు’ పథకంలో భాగంగా ప్రారంభిస్తారు.
అమెరికాకు చెందిన కంప్యూటర్ హార్డ్వేర్, మిడిల్ వేర్, సాఫ్ట్వేర్, కన్సల్టెన్సీ సంస్థ ఐబీఎం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. భారత క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థలకు బెంగళూరు కేంద్రంగా ప్రాజెక్టులను స్థాపించటం ఈ సంస్థ లక్ష్యమని ఈ సంస్థ ఛైర్మన్ అరవింద్ కృష్ణ ఈ సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ