పారిశ్రామిక పెట్టుబడుల వెల్లువ
ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవిస్తున్న సాంకేతిక ఆవిష్కారాలను అందిపుచ్చుకోవటంలో కర్ణాటక రాష్ట్రం చూపుతున్న చొరవ, వాటి ప్రగతిపై పారిశ్రామిక దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
రాజకీయ, పాలన వ్యవహారాలపై ఆరా
పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిట్టల్తో చర్చిస్తున్న ముఖ్యమంత్రి
ఈనాడు, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవిస్తున్న సాంకేతిక ఆవిష్కారాలను అందిపుచ్చుకోవటంలో కర్ణాటక రాష్ట్రం చూపుతున్న చొరవ, వాటి ప్రగతిపై పారిశ్రామిక దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కేవలం పెట్టుబడులను పెట్టి సరిపెట్టుకోకుండా, వాటికి రాష్ట్రం అందించే సహకారం, పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలపై సమగ్రంగా విశ్లేషించారు. మంగళవారం దావోస్లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి పరిశ్రమలు, ఐటీ- బీటీ శాఖ మంత్రులతో కలిసి రాష్ట్రం అందించే ప్రోత్సాహకాలను సవివరంగా వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ‘ప్రపంచ నిర్మాణం కోసం రాష్ట్రం’ పేరిట ఇన్వెస్ట్ కర్ణాటక పెవిలియన్లో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఎంతో ఆసక్తిగా కనిపించారు. చేతికి అందిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకునే దిశగా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.
రాజకీయాలపై మిట్టల్ ఆసక్తి
ప్రపంచ ఉక్కు తయారీ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్ రాష్ట్ర పెవిలియన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పెట్టుబడులకంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. రాష్ట్ర విధానసభలో భాజపా సంఖ్యాబలం ఎంతంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రస్తుత అధికార పక్షం సంఖ్యాబలం తెలుసుకున్నారు. బయట నుంచి వచ్చిన 15మంది సభ్యుల వివరాలను బొమ్మై వెల్లడించారు. పరిశ్రమల స్థాపనకు స్థిరమైన రాజకీయ వాతావరణం ఎంతో కీలకం. రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన సంస్థలు ఎప్పుడూ నిలకడైన ప్రభుత్వాలను కోరుకుంటాయని లక్ష్మీ మిట్టల్ అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వం రానుందన్న భరోసాను ముఖ్యమంత్రి కల్పించారు.
సందేశం ఘనం
పెట్టుబడిదారులను ఆకట్టుకునే దిశగా రాష్ట్ర పెవిలియన్ నుంచి స్పష్టమైన పారిశ్రామిక సందేశాలను ఏలికలు ప్రకటించారు. కర్ణాటక ప్రస్తావన లేకుండా దేశ ఐటీ రంగం నివేదిక రూపొందించలేరు. ఐటీతో పాటు హెచ్ఏఎల్, డీఆర్డీఓ, ఎన్ఏఎల్, ఇస్రో వంటి సంస్థలున్న రాష్ట్రం అంతర్జాతీయ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగలదు. ప్రతి బడ్జెట్లోనూ పారిశ్రామిక రంగానికి ఇచ్చే ప్రాధాన్యం, ఐటీ- బీటీ, ఆర్అండ్డీ కేంద్రాలు, అంకుర సంస్థల సమస్యలకు స్థానికంగానే పరిష్కారాలు, భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 50శాతం రాష్ట్రానికి వస్తున్నాయన్న సందేశాన్ని ముఖ్యమంత్రి బొమ్మై, భారీ పరిశ్రమల మంత్రి మురుగేశ్ నిరాణి, ఐటీ- బీటీ మంత్రి అశ్వత్థనారాయణ బృందం స్పష్టం ప్రచారం చేస్తోంది.
అదాని వేదిక..
దేశవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని ఇటీవల భారీ లక్ష్యాలను ప్రకటించిన అదానీ గ్రూప్ అధ్యక్షుడు గౌతమ్ అదానీ మంగళవారం కర్ణాటక పెవిలియన్ను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం అందించే రాయితీలను రంగాల వారీగా సేకరించారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పథకాల ప్రత్యేకతలను తెలుసుకున్నారు. ఒక జిల్లా, ఒకే ఉత్పత్తి, బియాండ్ ద బెంగళూరు పథకాల వివరాలను సేకరించారు. ఈ రెండు పథకాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు.
జార్జ్ ఒలివర్కు జ్ఞాపిక అందిస్తున్న ముఖ్యమంత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలారు బాటలో కల్లోలం
[ 28-03-2024]
రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అనూహ్యంగా ఎదురైన ఆ ఘట్టం అధికార కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. ఇలాంటి వ్యవహారమే మునుపు.. 2019 జులై 5వ తేదీన తలెత్తింది. -
చిత్రదుర్గ బరిలో కారజోళ!
[ 28-03-2024]
రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను భాజపా వెల్లడించింది. -
అక్రమార్కుల నివాసాలపై దాడులు
[ 28-03-2024]
ఆదాయంతో పొంతన లేని ఆర్జన కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. -
వికసిత భారత్ సాధనే లక్ష్యం
[ 28-03-2024]
దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గద్దెనెక్కాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర పేరొన్నారు. -
హృదయం లేని మోదీ
[ 28-03-2024]
కర్ణాటకలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంటామన్న భయంతోనే భాజపా- జనతాదళ్ పొత్తు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. -
ఉత్కంఠంగా విద్యావర్ధక సంఘం ఎన్నికలు
[ 28-03-2024]
వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్, కార్యదర్శిగా అరవింద్ పాటీల్లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు. -
అక్రమ తరలింపులపై దాడులు
[ 28-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇంటిపై, రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3.52 లక్షలు విలువ చేసే 842.72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
తిప్పేరుద్రస్వామి తిరునాలకు పోటెత్తిన భక్తులు
[ 28-03-2024]
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి తిరునాళ్లకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు. -
ఎన్ఐఏ విస్తృత దాడులు
[ 28-03-2024]
రాజధాని నగరంలోని బ్రూక్ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడు దర్యాప్తులో భాగంగా శివమొగ్గ, బెంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, చెన్నైలలో బుధవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు దళం (ఎన్ఐఏ) అధికారులు దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!