logo

క్షేత్ర అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే గణేశ్‌

కంప్లి విధానసభ క్షేత్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నానని స్థానిక శాసనసభ్యుడు గణేశ్‌ స్పష్టం చేశారు. తాలూకాలోని శాంతినగర్‌లో శుద్ధ తాగునీటి కేంద్రం పనులను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.

Published : 25 May 2022 05:07 IST

శాంతినగర్‌లో తాగునీటి కేంద్రం పనులను ప్రారంభిస్తున్న శాసనసభ్యుడు

కంప్లి: కంప్లి విధానసభ క్షేత్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నానని స్థానిక శాసనసభ్యుడు గణేశ్‌ స్పష్టం చేశారు. తాలూకాలోని శాంతినగర్‌లో శుద్ధ తాగునీటి కేంద్రం పనులను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కంప్లిలోని చారిత్రక సోమప్ప చెరువు చుట్టూ రక్షణ కంచె వ్యవస్థ కల్పించి ఆకర్షణ కోసం పక్కనే ఉద్యానవనం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు చెరువు చుట్టూ స్వచ్ఛత కాపాడాలని కోరారు. నెల్లుడి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు లింగుట్ల శ్రీనివాసులు, కె.సుధాకర్‌, రాజేంద్రప్రసాద్‌, ఎల్‌.రామానాయుడు, కేశవరెడ్డి, వీరాంజనేయులు, జీపీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని