పంచాయతీలలో అస్పృశ్యత నివారణకు చర్యలు
రాష్ట్రంలోని 6,020 గ్రామ పంచాయతీలలో అస్పృశ్యత నిర్మూలనా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కోటా శ్రీనివాస పూజారి పేర్కొన్నారు. మంగళవారం కొప్పళలో ఆయన పలు పథకాల లబ్ధిదారులకు పరికరాలు, వాహనాలు పంపిణీ చేసి సాంఘిక సంక్షేమశాఖ పథకాల ప్రగతిని సమీక్షించారు
ట్యాబ్లు పంపిణీ చేస్తున్న మంత్రి కోటా శ్రీనివాస పూజారి
గంగావతి, న్యూస్టుడే: రాష్ట్రంలోని 6,020 గ్రామ పంచాయతీలలో అస్పృశ్యత నిర్మూలనా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కోటా శ్రీనివాస పూజారి పేర్కొన్నారు. మంగళవారం కొప్పళలో ఆయన పలు పథకాల లబ్ధిదారులకు పరికరాలు, వాహనాలు పంపిణీ చేసి సాంఘిక సంక్షేమశాఖ పథకాల ప్రగతిని సమీక్షించారు. ప్రభుత్వం కఠిన చట్టాలు ప్రవేశ పెట్టినా జిల్లాలో ఇలాంటి సామాజిక రుగ్మతలు ఇంకా ఉండడంపై విచారం వ్యక్తం చేశారు. వీటిని రూపుమాపేందుకు స్వామీజీలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రతి పంచాయతీలో అస్పృశ్యత నివారణ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కొప్పళ జిల్లాలో 100 జంటలకు సామూహిక వివాహాలు నెరవేర్చనున్నట్లు చెప్పారు. విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రారంభించిన ఓబవ్వ ఆత్మరక్షణ కళను ఆరో తరగతికి విస్తరిస్తున్నట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ పథకాల్లో మధ్యవర్తుల బెడదను తప్పించాలన్నారు. గనుల, మహిళా, శిశ ుసంక్షేమశాఖ మంత్రి హాలప్పా ఆచార్ మాట్లాడుతూ జిల్లాలో 27 మొరార్జీ వసతి పాఠశాలలు ఉండి 11వేల మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారన్నారు. 1,440 మందికి మాత్రమే ప్రవేశం లభిస్తోందన్నారు. మిగిలిన వారు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందంటూ వసతి పాఠశాలల సంఖ్య పెంచాలని కోరారు. కార్యక్రమంలో శాసనసభ్యులు అమరేగౌడ, రాఘవేంద్ర హిట్నాళ, ధడేసూగూరు బసవరాజ్, జిల్లా పాలనాధికారి వికాస్కిశోర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్