పాలనాసౌధంలో మహిళా సాధికారత!
కన్నడిగుల పాలనా కేంద్రం.. విధానసౌధలో అత్యంత కీలకమైన పదవులను మహిళలే అలంకరించటం రాష్ట్ర చరిత్రలో అరుదైన ఘట్టం. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వందితా శర్మ.. ఆ బాధ్యతలు చేపట్టిన నాలుగో మహిళగా గుర్తింపు పొందారు.
మూడు కీలక హోదాల్లోనూ వారే
ఈనాడు డిజిటల్, బెంగళూరు : కన్నడిగుల పాలనా కేంద్రం.. విధానసౌధలో అత్యంత కీలకమైన పదవులను మహిళలే అలంకరించటం రాష్ట్ర చరిత్రలో అరుదైన ఘట్టం. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వందితా శర్మ.. ఆ బాధ్యతలు చేపట్టిన నాలుగో మహిళగా గుర్తింపు పొందారు. ఇదే సౌధలో విధానసభ, పరిషత్లకు కార్యదర్శులుగా పని చేస్తున్న వారూ మహిళలే కావటం గమనార్హం. విధానసభ కార్యదర్శిగా ఎం.కె.విశాలాక్షి, పరిషత్ కార్యదర్శిగా కె.ఆర్.మహాలక్ష్మి ఇప్పటికే బాధ్యతల్లో మమేకమయ్యారు.
గతంలో ఇద్దరు..
గతంలోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రత్నప్రభ పని చేస్తున్న సమయంలో పోలీసు శాఖ ఉన్నతాధికారి (డీజీపీ)గా నీలమణి రాజు పని చేశారు. ఒకే సేవా కాలంలో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నత పదవులు అలంకరించగా.. తాజాగా ముగ్గురు మహిళలు ఉన్నత పదవుల్లో ఉండటం విశేషం.
సవాళ్లమయం..
విధానసభ కార్యదర్శిగా ఎం.కె.విశాలాక్షి నియమితులైన క్షణంలో- కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో కార్యదర్శిగా ఉన్న ఎస్.మూర్తి అవినీతి ఆరోపణలతో పదవి నుంచి బహిష్కృతులయ్యారు. ఆయన తర్వాత బాధ్యతలు స్వీకరించిన ఎం.కె.విశాలాక్షి.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మారథాన్ రాజీనామాలు, పార్టీ ఫిరాయింపులు, భాజపా సర్కారు ఏర్పాటు వంటి ఉత్కంఠ పరిణామాలను చాకచక్యంగా నిర్వర్తించారు. మరోవైపు పరిషత్లోనూ కార్యదర్శిగా ఉన్న కె.ఆర్.మహాలక్ష్మికి కూడా ఆ సభ కార్యకలాపాలు సవాళ్లను విసిరాయి. 2021 డిసెంబరులో సమావేశమైన విధానసభ కార్యకలాపాల్లో పరిషత్ ఉపసభాపతి ఎస్ఎల్.ధర్మేగౌడను ఆసనం నుంచి తొలగించిన సంఘటన జాతీయ స్థాయిలో రచ్చగా మారింది. ఆ సందర్భంగా ఉత్తర్వులు, సభా వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను కార్యదర్శి కె.ఆర్.మహాలక్ష్మి చక్కగా నిర్వహించారు.
ఎన్నికలకు సారథులు
2023 ఎన్నికలకు ఈ ముగ్గురు మహిళా అధికారులే సారథులు కానున్నారు. మరో ఏడాదిలో నిర్వహించే ఎన్నికల కోసం మంత్రివర్గమంతా రాజకీయాల వైపు దృష్టి సారిస్తుంది. చివరకు ముఖ్యమంత్రి కూడా పార్టీ, ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి యావత్తు పాలన భారాన్ని నిభాయించాలి. ఎన్నికల తర్వాతి కార్యకలాపాల్లో ఉభయ సభల కార్యదర్శులు పాత్ర కీలకంగా మారనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ