ఆత్మగౌరవ శిఖరం.. నందమూరి
అమ్మ భాషను గౌరవిస్తూ అన్ని భాషాలూ నేర్చుకోవాలని ప్రముఖ సినీనటి పద్మశ్రీ షావుకారు జానకి పిలుపునిచ్చారు. భాషా విద్వేషాలు పనికి రావని హితవు పలికారు. జాతీయ భాష అంటూ హిందీని బలవంతంగా రుద్దడం మంచిది కాదన్నారు.
జ్ఞాపకాల దొంతర కదిలించిన షావుకారు జానకి
షావుకారు జానకికి ఎన్టీఆర్ పురస్కారం అందజేసి
సత్కరిస్తున్న మంత్రి మునిరత్న, డాక్టర్ రాధాకృష్ణరాజు, ఆర్వీ హరీష్,
ఉమాపతి నాయుడు, ల్లక్ష్మీరెడ్డి, నరసింహమూర్తి తదితరులు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : అమ్మ భాషను గౌరవిస్తూ అన్ని భాషాలూ నేర్చుకోవాలని ప్రముఖ సినీనటి పద్మశ్రీ షావుకారు జానకి పిలుపునిచ్చారు. భాషా విద్వేషాలు పనికి రావని హితవు పలికారు. జాతీయ భాష అంటూ హిందీని బలవంతంగా రుద్దడం మంచిది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా శనివారం బెంగళూరులోని తెలుగు విజ్ఞాన సమితి శ్రీకృష్ణదేవరాయలు కళామందిరంలో కర్ణాటక తెలుగు అకాడమీ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్ణాటక తెలుగు అకాడమీ ప్రముఖులు ఆమెకు ఎన్టీఆర్ పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. జానకీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు దర్పణం నందమూరి వారేనని శ్లాఘించారు. తన మొదటి సినిమా ‘షావుకారు’లో ఆయనతో కలిసి కథానాయికగా నటించానని గుర్తు చేసుకున్నారు. అభినయం, క్రమశిక్షణ, పట్టుదల ఆయనలో మెండుగా ఉండడమే విజయానికి కారణంగా వివరించారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాకనే ఆంధ్రప్రదేశ్ స్థితి, గతులు మారిపోయాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చారని కీర్తించారు. సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి సంచలనం సృష్టించినట్లే.. రాజకీయాల్లోనూ ప్రభంజనం సృష్టించారని ప్రస్తుతించారు. కర్ణాటక ఉద్యానవనాల శాఖ మంత్రి మునిరత్న మాట్లాడుతూ నందమూరికి ఏనాడో భారతరత్న పురస్కారం దక్కాల్సిందని, భవిష్యత్తులో ఆ కీర్తి దక్కుతుందనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణరాజు మాట్లాడుతూ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ఇప్పటి నుంచి ఈ-మెయిళ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజలు విన్నపాలు పంపించాలని పిలుపునిచ్చారు. ఏడాది పాటు నందమూరి శత జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమితి ప్రధాన కార్యదర్శి ఇడమకంటి లక్ష్మీరెడ్డి, కర్ణాటక తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి కె.ఎన్.నరసింహమూర్తి, అధ్యక్షుడు ఆర్వీ హరీష్, కార్యాధ్యక్షుడు ఉమాపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM