మఠాధిపతితో బొమ్మై చర్చలు
వాల్మీకి సామాజికవర్గానికి రిజర్వేషన్ శాతం పెంచాలని, మాజీ న్యాయమూర్తి నాగమోహన్దాస్ నివేదికలోని ప్రతిపాదనలను అమలు చేయాలని డిమాండు చేస్తూ బెంగళూరు స్వతంత్ర ఉద్యానవనంలో 108 రోజుల నుంచి ధర్నా చేస్తున్న వాల్మీకి మఠాధిపతి ప్రసన్నానంద పురి స్వామిని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం కలిసి చర్చించారు.
వాల్మీకి మఠాధిపతి ప్రసన్నానందపురి స్వామితో మాట్లాడుతున్న బొమ్మై
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : వాల్మీకి సామాజికవర్గానికి రిజర్వేషన్ శాతం పెంచాలని, మాజీ న్యాయమూర్తి నాగమోహన్దాస్ నివేదికలోని ప్రతిపాదనలను అమలు చేయాలని డిమాండు చేస్తూ బెంగళూరు స్వతంత్ర ఉద్యానవనంలో 108 రోజుల నుంచి ధర్నా చేస్తున్న వాల్మీకి మఠాధిపతి ప్రసన్నానంద పురి స్వామిని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం కలిసి చర్చించారు. సమాజ సంక్షేమం కోసమే మఠాధిపతి పోరాటం చేస్తున్నారని, ఆయన డిమాండ్లపై నాకు అవగాహన ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. రిజర్వేషన్ల పరిధి 50 శాతానికి మించరాదనే సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ప్రస్తావించారు. రిజర్వేషన్ పెంచాలనే డిమాండుపై పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి హామీ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదే ప్రాంతంలో ధర్నా చేస్తున్న పీఎస్ఐ పరీక్ష రాసిన అభ్యర్థులను ఆయన కలిసి మాట్లాడారు. ఈ వ్యవహారంలో అక్రమాలపై దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ పూర్తయ్యే వరకు ఓపిక పట్టాలని హితవు చెప్పారు.
స్వతంత్ర ఉద్యానవనానికి విచ్చేసిన ముఖ్యమంత్రిని మాజీ మంత్రి బి.టి.లలితా నాయక్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వెంకటస్వామి, ఇతర ప్రతినిధులు కలుసుకున్నారు. ఎస్సై నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, అర్హులకు ఉద్యోగాలు లభించేలా చూడాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
ఎస్సై ఉద్యోగాల నియామక ప్రక్రియను రద్దు చేయకుండా కొనసాగించాలని డిమాండు చేస్తూ బెంగళూరులో ఆందోళనకు దిగిన అభ్యర్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’