చింతన శిబిరాలతో ప్రజలకు చేరువ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని కాంగ్రెస్ పెద్దలు కార్యకర్తలకు హితవు పలికారు.
మైసూరులో నవ సంకల్ప చింతన శిబిరాన్ని ప్రారంభిస్తున్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు
మైసూరు, న్యూస్టుడే : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని కాంగ్రెస్ పెద్దలు కార్యకర్తలకు హితవు పలికారు. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా గురువారం మైసూరులో నవ సంకల్ప శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో మైసూరు ప్రాంతానికి చెందిన అనేకమంది నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ రాష్ట్రపతి అభ్యర్థిగా ఓ గిరిజన మహిళను ఎంపిక చేశామని భాజపా గొప్పలు చెప్పుకొంటోందని ఎద్దేవా చేశారు. ఆమె ఎప్పుడో గవర్నరుగా విధులను నిర్వర్తించి ప్రతిభను చాటుకున్న విషయాన్ని విస్మరించినట్లున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి స్థానంలో కీలుబొమ్మగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆమెను ఎంపిక చేశారన్నారు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే ఆర్ఎస్ఎస్ అధినేతగా మహిళను నియమించాలని సవాల్ విసిరారు. ఈ తరహా శిబిరాల్ని అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ కార్యాధ్యక్షుడు ధృవనారాయణ, మాజీ మంత్రి హెచ్.సి.మహదేవప్ప తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన
బెంగళూరు (యశ్వంతపుర): కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అమలులోకి తేనున్న అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రకటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించారు. దేశ యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు ఎలాంటి ముందస్తు అంచనాలూ లేకుండా అగ్నిపథ్ అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని విధానసభ నియోజకవర్గాల్లో ఆ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు శాంతియుతంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తారని ఆయన హామీనిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..
[ 18-04-2024]
బెంగళూరు నగర శివారు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై వీడియో చిత్రీకరించి, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ వికాస్ గౌడను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. -
భార్య హంతకుడికి ఐదేళ్ల కారాగారం
[ 18-04-2024]
సారాయి తాగవద్దని అడ్డుకుంటున్న నసీమా (23) అనే గృహిణిని 2021 అక్టోబరు 19న బ్లేడుతో గొంతు కోసి హత్య చేసిన ఆమె భర్త ఇబ్రహీం సయ్యద్ హబీబ్ (25)కు కలబురగిలోని ఒకటో అదనపు జిల్లా న్యాయస్థానం.. -
భాజపాతో పోటీ.. హామీలు గ్యారంటీ
[ 18-04-2024]
కర్ణాటకలో గ్యారంటీలను సజావుగా అమలు చేశామన్న ధీమాతో కాంగ్రెస్ దేశప్రజలకు అదే స్థాయి హామీలిచ్చింది. ఇప్పటికే 25 గ్యారంటీలతో ఎన్నికల ప్రణాళిక ప్రకటించిన కాంగ్రెస్ వాటిపై రాష్ట్ర ప్రచారంలో మరింత వివరణ ఇచ్చింది. -
భాజపాకు గ్యారంటీల భయం.. హస్తానికదే అభయం
[ 18-04-2024]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలు కొట్టుకుని పోతాయని ప్రచారంలో ముందుకు వెళ్తున్న భాజపాకు ఎక్కడో అదే గ్యారంటీల భయం వెంటాడుతోందని సర్వత్రా చర్చనీయాంశమైంది. -
విద్యానగరిలో స్వతంత్రుడి సెగ?
[ 18-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలో అనుభవం కలిగిన నాయకుడు ప్రహ్లాద్ జోసి- యువనేత వినోద్ అసూటి మధ్య మధ్య పోటీ రసవత్తరంగా మారింది. -
పంచభూతాల్లో లీనమైన ద్వారకీశ్
[ 18-04-2024]
గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించిన సీనియరు నటుడు, దర్శకుడు, నిర్మాత- ద్వారకీశ్ భౌతికకాయానికి చామరాజపేట టీఆర్ మిల్ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం పోలీసు గౌరవ లాంఛనాలతో- కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించారు. -
డీకేపై గౌడ తీవ్ర ఆరోపణ
[ 18-04-2024]
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆస్తి కోసం ఒక తొమ్మిదేళ్ల బాలికను అపహరించారని మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ మంగళవారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
కరడికి చేయందించిన కాంగ్రెస్
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై, మంగళవారం లోక్సభ సభ్యత్వానికి- భారతీయ జనతాపార్టీకీ రాజీనామా చేసిన కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ బుధవారం బెంగళూరులో కాంగ్రెస్లో చేరారు. -
మోదీ సభకు సకల సన్నాహాలు
[ 18-04-2024]
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించే బహిరంగలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజె వెల్లడించారు. -
భాజపాను బలపరుద్దాం
[ 18-04-2024]
మాదిగ సముదాయ ప్రజలందరం భాజపాను బలపరుద్దామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. చెళ్లకెర వాసవీ కల్యాణ మంటపంలో బుధవారం జరిగిన మాదిగ సముదాయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మంత్రి మల్లికార్జున ప్రచారం
[ 18-04-2024]
బోవి గురుపీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున వివిధ పీఠాధిపతులను కలిసి లోక్సభ ఎన్నికల్లో దావణగెరె కాంగ్రెస్ అభ్యర్థి డా.ప్రభ మల్లికార్జునకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
భాజపా రామాలయం నిర్మిస్తే.. మేం రామరాజ్యమే తెస్తాం
[ 18-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామరాజ్యమే నిర్మిస్తామని బళ్లారి జిల్లా మంత్రి బి.నాగేంద్ర స్పష్టం చేశారు. జూన్ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పతనమవుతుంది. -
ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కుమారస్వామి స్పష్టీకరణ
[ 18-04-2024]
తాను ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఉంటే సంకీర్ణ ప్రభుత్వం పతనమయ్యేది కాదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..