అంతుచిక్కని హస్తిన నాడి
కేవలం వారం వ్యవధిలో దిల్లీకి రెండుసార్లు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. పర్యటనల రహస్యం గుట్టు విప్పలేదు.
బెంగళూరు విమానాశ్రయ సమీపాన నిర్మాణంలోని కెంపేగౌడ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం పరిశీలిస్తున్న
ముఖ్యమంత్రి బొమ్మై, మంత్రి అశ్వత్థనారాయణ
ఈనాడు, బెంగళూరు : కేవలం వారం వ్యవధిలో దిల్లీకి రెండుసార్లు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. పర్యటనల రహస్యం గుట్టు విప్పలేదు. శుక్రవారం.. అధికారికంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము నామినేషన్ ప్రక్రియకు సాక్షి సంతకం చేసిన ముఖ్యమంత్రి వెనువెంటనే బెంగళూరుకు పయనమయ్యారు. రెండు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి పాల్గొన్న ఏకైక అధికారిక కార్యక్రమం ఇదే కావటం గమనార్హం.
* ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారిక పర్యటన పట్టిక ప్రకారం బసవరాజ బొమ్మై గురు, శుక్రవారాల్లో పలువురు మంత్రులతో సమావేశం కావాలి. అధికారికంగా ఏ మంత్రితోనూ భేటీ అయినట్లు సీఎంఓ వెల్లడించలేదు. గురువారం రాత్రి కర్ణాటక భవన్లో బస చేసిన ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి భగవంత ఖూబా, ఎంపీ శివకుమార్ ఉదాసిలతో పాటు మంత్రి బి.శ్రీరాములు, ఎమ్మెల్యే రాజుగౌడ మాత్రమే ఉన్నారు. ఎన్డీఏ కూటమిలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలతో సందడిగా కనిపించిన ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్తావనలు లేవని సంకేతాలిచ్చారు.
పెరిగిన భరోసా
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచీ బసవరాజ బొమ్మై కుర్చీ ఊగిసలాడుతూనే ఉంది. నాలుగు నెలలుగా ఆయన నాయకత్వంపై విమర్శలు గుప్పించే నేతలు క్రమంగా కనుమరుగవుతున్నారు. గతేడాది డిసెంబరు నాటి ఎమ్మెల్యే ఎన్నికలు, తాజా ఎమ్మెల్సీ బరిలో అనుకున్న స్థాయిలో సీట్లను సాధించలేకపోవటంతో ముఖ్యమంత్రి స్థానంపై విమర్శలు గుప్పుమన్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో అధిష్ఠానం అంచనాను కూడా తలకిందులు చేస్తూ మూడో అభ్యర్థిని గెలిపించుకోవటంతో బొమ్మై పట్ల విశ్వాసం రెట్టింపైంది.
* ఇటీవలి ప్రధాని రాష్ట్ర పర్యటనలో ముఖ్యమంత్రి మరిన్ని మార్కులు కొట్టేసినట్లే. కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయటంలో రాష్ట్రం భేషుగ్గా పని చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇచ్చిన కితాబు బొమ్మైకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. పైగా ఎన్నికలకు కేవలం ఎనిమిది నెలల సమయమే ఉండటంతో మరింత వేగంగా అభివృద్ధి సాధించాలన్న ప్రధాని సూచన బొమ్మై నాయకత్వంపై విశ్వాసాన్ని పెంచినట్లే. గత వారం రాష్ట్రానికి వచ్చిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బొమ్మై నాయకత్వాన్ని ప్రశంసించటం కూడా బొమ్మైకు కలిసొచ్చే అంశమే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యహారాలను అధిష్ఠానానికి చేరవేస్తూ తన పట్టు బిగిస్తున్న ముఖ్యమంత్రి నాయకత్వంపై అడపాదడపా మాట్లాడే బసవనగౌడ యత్నాళ్, రేణుకాచార్య దాదాపు శాంతించారు. మంత్రివర్గ విస్తరణను పదే పదే వాయిదా వేస్తున్నా నోరు మెదపని ఆశావహులను చూస్తుంటే.. బొమ్మై నాయకత్వానికి సమీప భవిష్యత్తులో ఢోకా లేనట్లేనని రాజకీయ పండితుల మదింపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా