మాదకద్రవ్యాల ముఠాకు కటకటాలు
మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న కాలిఫా అబ్దులిహి, డేనియల్ అనే నైజీరియన్లను బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే : మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న కాలిఫా అబ్దులిహి, డేనియల్ అనే నైజీరియన్లను బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. చదువుకునేందుకు ఐదేళ్ల కాలపరిమితి ఉండే వీసాతో వీరు బెంగళూరుకు వచ్చారు. వీసా కాలపరిమితి పూర్తయినా అక్రమంగా ఇక్కడే ఉంటూ, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. వీరి నుంచి ఎండీఎంఏ మాత్రలు, ఎల్ఎస్డీ చీటీలు స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువను రూ.8 లక్షలుగా అంచనా వేశారు. ఒక గ్రాము ఎండీఎంఏ మాత్రను వీరు రూ.5 వేలకు విక్రయించేవారు. కేసు తదుపరి దర్యాప్తు బాధ్యతలను బాణసవాడి పోలీసులకు అప్పగించారు.
అదుపులో.. డీజే
బెంగళూరు (సదాశివనగర) : మాదక ద్రవ్యాలను తరలించి, విక్రయిస్తున్న జెపిన్ జడే హ్యారీ అనే డిస్కో జాకీ (డీజే)ని సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. డార్క్వెబ్ ద్వారా నగరానికి మాదక ద్రవ్యాలు తెప్పించుకునేవాడు. నిందితుడి నుంచి 15.08 గ్రాముల ఎండీఎంఏ మాత్రలు, 0.48 గ్రాముల ఎల్ఎస్డీ స్ట్రిప్లు, ఒక కిలో గంజాయి, ఒక ల్యాప్టాప్, ఒక చరవాణి స్వాధీనపరుచుకున్నామని జాయింటు పోలీసు కమిషనర్ రమణగుప్త తెలిపారు. వీటి విలువను రూ.6.5 లక్షలుగా అంచనా వేశారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కేసు తదుపరి దర్యాప్తు బాధ్యతలను వివేకనగర పోలీసులకు అప్పగించారు.
నాశనం చేస్తే పోలా..
బెంగళూరు (శివాజీనగర): అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.25.6 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను నాశనం చేసేందుకు న్యాయస్థానం నుంచి నగర పోలీసులు అనుమతి పొందారు. ఆదివారం 21 టన్నుల మాదక ద్రవ్యాలను నాశనం చేయనున్నారు. బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిందితుల నుంచి స్వాధీనపరుచుకున్న గంజాయి, నల్లమందు, కొకైన్, సింథటిక్ డ్రగ్స్ను ధ్వంసం చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. గత ఏడాది జూన్ 26న రూ.50.23 కోట్ల విలువైన 24 టన్నుల మాదక ద్రవ్యాలను పోలీసులు ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నెండు నెలల్లో మాదక ద్రవ్యాలకు సంబంధించి 8,5,05 కేసులు నమోదు చేసి 7,846 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో 185 మంది విదేశీయులు ఉన్నారు. ఈ కేసుల్లో 5,363 కేసుల దర్యాప్తు పూర్తి చేసి, న్యాయస్థానాలకు అభియోగపత్రాలను దాఖలు చేశామని అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.