మాయా(వి)వలలో విలవిల
డేటింగ్ యాప్లో పరిచయమైన అపరిచితురాలి మాటల్ని నమ్మి హరిశంకర్ అనే వ్యక్తి రూ.5.81 కోట్లు పోగొట్టుకున్నాడు.
రూ.5.81 కోట్లు హుష్కాకి
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : డేటింగ్ యాప్లో పరిచయమైన అపరిచితురాలి మాటల్ని నమ్మి హరిశంకర్ అనే వ్యక్తి రూ.5.81 కోట్లు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు హనుమంతనగరలోని ఇండియన్ బ్యాంకులో మేనేజరుగా పని చేస్తున్న హరిశంకర్కు భార్య, పిల్లలు ఉన్నారు. నాలుగు నెలల కిందట ఓ డేటింగ్ యాప్ను తన నాజూకు చరవాణిలో డౌన్లోడ్ చేసుకుని, పేరు నమోదు చేసుకున్నాడు. ఈ యాప్లో పరిచయమైన యువతితో స్నేహాన్ని పెంచుకున్నాడు. ఇద్దరూ వీడియో కాల్స్ చేసుకొంటూ ప్రేమ సందేశాలు పంపుకొన్నారు. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామని ఆమె ఇచ్చిన ఆఫర్తో మొదట తన వద్ద ఉన్న రూ.12 లక్షలు బదిలీ చేశాడు. మరింత ఎక్కువ నగదు కావాలని చెప్పడంతో తమ బ్యాంకులో పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అనిత అనే సీనియరు సిటిజన్ ఖాతాపై రూ.6 కోట్లు రుణాన్ని తన పేరిట తీసుకుని, తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు.
అందులో నుంచి రూ.5.69 కోట్లను తన ప్రియురాలికి దశలవారీగా బదిలీ చేశాడు. రుణానికి సంబంధించి అనిత చరవాణికి సందేశాలు వెళ్లడంతో ఆమె బ్యాంకుకు వచ్చి విచారించారు. అసలు విషయం అక్కడే బయటపడింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో హరిశంకర్ను అరెస్టు చేశారు. డేటింగ్ యాప్లో పరిచయం అయిన యువతి కూడా ఇప్పుడు ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకుంది. బ్యాంకులో రుణం తీసుకునేందుకు అక్కడే పని చేస్తున్న మునిరాజు అనే క్లర్క్ సహకరించాడని గుర్తించిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?