సమాజాన్ని బతికిస్తున్న శ్మశాన కార్మికులు
చేస్తున్న పనిని దైవంగా భావించే శ్మశాన కార్మికులు నేడు సమాజాన్ని బతికిస్తున్నారని అఖిల భారత దళిత శోషణ్ ముక్తిమంచ్ ఉపాధ్యక్షుడు (దిల్లీ), సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న బి.వి.రాఘవులు పాల్గొన్న కార్మికులు
హొసపేటె, న్యూస్టుడే: చేస్తున్న పనిని దైవంగా భావించే శ్మశాన కార్మికులు నేడు సమాజాన్ని బతికిస్తున్నారని అఖిల భారత దళిత శోషణ్ ముక్తిమంచ్ ఉపాధ్యక్షుడు (దిల్లీ), సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర శ్మశాన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హొసపేటె పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన శ్మశాన కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితులు, కార్మికులనగానే సమాజం, ప్రభుత్వాలు కూడా చిన్నచూపు చూస్తున్నాయి. ఇప్పటి వరకు శ్మశాన కార్మికులను ప్రభుత్వాలు మనుషులుగా కూడా పరిగణనలోకి తీసుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఏ కులంవారు వచ్చినా వెనకాముందు చూడకుండా అంతిమ సంస్కారాలు చేస్తున్నవారిపై ప్రభుత్వాలెందుకు వివక్ష ధోరణి ప్రదర్శిస్తున్నాయని నిలదీశారు. స్థానిక సంస్థల్లోని పౌర కార్మికులకు కూడా నెలకు రూ.13,500 జీతం ఇస్తున్నారు. శ్మశాన కార్మికులకు దహన సంస్కార అనంతరం వచ్చిన ఇనాముతోనే జీవితం సాగిస్తున్నారు. ఈ వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓ చట్టాన్ని తీసుకురావాలి. వారి పిల్లల చదువులు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆ వర్గం విద్యార్థులకు ప్రత్యేక వసతి నిలయాలు, వసతి పాఠశాలలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మీకు న్యాయం చేకూరే వరకు పోరాటం నుంచి విశ్రమించకండని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి యు.బసవరాజ్, సంఘం రాష్ట్ర సహసంచాలకురాలు బి.మాళమ్మ, దళిత హక్కుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు గోపాలకృష్ణ హరళహళ్లి, ప్రముఖులు ఆర్.ఎస్.బసవరాజ్, భాస్కర్ రెడ్డి, జంబయ్య నాయక, కె.నాగరత్నమ్మ, వి.స్వామి పాల్గొన్నారు.
అగ్నిపథ్పై పునరాలోచించండి
హొసపేటె: సైన్యంలో సేవలను కుదించే అగ్నిపథ్ పథకం అమలుపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హొసపేటెలో విలేకరులతో మాట్లాడారు. నిపుణులు, మాజీ సైనికాధికారులు, విపక్షాల అభిప్రాయాలను కూడా అడగకుండా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అమలులోకి తీసుకురావడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ముమ్మాటికీ ఇది కార్పొరేట్ కంపెనీలకు సహాయం చేయడమేనని తేల్చిచెప్పారు. 17 ఏళ్ల తమ సేవలో సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి దేశభద్రత కోసం పోరాటాలు చేస్తారు. వారి సేవా వ్యవధిని నాలుగేళ్లకు కుదిస్తే సేవలు చేయడం సాధ్యమేనా? అని నిలదీశారు. ఇది సైనికులను అవమానించే ప్రయత్నమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను 60 ఏళ్లకు పదవీ విరమణ చేస్తారు, కాని సైనికులకు నాలుగేళ్లు మాత్రమేనా అని ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వ్యాపార కేంద్రంగా మారింది. కొనుగోలు, అమ్మకాల్లో మునిగిపోయి, ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని రాఘవులు ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే