logo

కిడ్నాపర్ల ఆటకట్టు

అపహరణకు గురైన అబిజిత్‌ (12) అనే బాలుడు కొన్ని గంటల్లోనే సురక్షితంగా తల్లిదండ్రులను చేరిన సంఘటన గురువారం మైసూరు కువెంపు నగరలో చోటుచేసుకుంది.

Published : 25 Jun 2022 00:55 IST

అభిజిత్‌

మైసూరు, న్యూస్‌టుడే : అపహరణకు గురైన అబిజిత్‌ (12) అనే బాలుడు కొన్ని గంటల్లోనే సురక్షితంగా తల్లిదండ్రులను చేరిన సంఘటన గురువారం మైసూరు కువెంపు నగరలో చోటుచేసుకుంది. కె.ఆర్‌.అసుపత్రిలో వైద్యులుగా ఉన్న దంపతుల తనయుడు అభిజిత్‌ గురువారం ఆడుకునే సమయంలో కారులో వచ్చిన దుండగులు అపహరించారు. ఈ విషయాన్ని వెంటనే బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నగరం నుంచి బయటకు వెళ్లకుండా అన్ని మార్గాల్లో కాపలాను ఏర్పాటు చేసి గాలింపును ముమ్మరం చేశారు. తప్పించుకునేందుకు మరో మార్గంకానరాక బాలుడిని గురువారం రాత్రి వదిలిపెట్టారని తెలిసింది. అపహరించినవారు తనకు బిస్కెట్లు, చాకొలెట్లు ఇచ్చేందుకు వచ్చినా తాను నిరాకరించినట్లు అభిజిత్‌ తెలిపారు. నగరంలోనే తనను కారులో బంధించి ఉంచారని.. చివరికి వదిలేశారని వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని