ఎలక్ట్రానిక్స్ పరిశోధనలకు అగ్రాసనం
రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయిలో పెంచాల్సిన అవసరంపై కేంద్ర ఐటీ- బీటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్చంద్రశేఖర్ బెంగళూరులో గుర్తు చేస్తూ.. ఆ దిశగా కన్నడనాట ప్రారంభమైన చర్యలను అభినందించారు. ఇస్రో నిర్వహించిన ‘దేశీ’ సదస్సులో ఆయన శుక్రవారం పాల్గొని.. 2025 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థికతకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో స్వావలంబన
ఇంటెల్ కేంద్రం ముందు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నివృతి రావు
ఈనాడు, బెంగళూరు : రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయిలో పెంచాల్సిన అవసరంపై కేంద్ర ఐటీ- బీటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్చంద్రశేఖర్ బెంగళూరులో గుర్తు చేస్తూ.. ఆ దిశగా కన్నడనాట ప్రారంభమైన చర్యలను అభినందించారు. ఇస్రో నిర్వహించిన ‘దేశీ’ సదస్సులో ఆయన శుక్రవారం పాల్గొని.. 2025 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థికతకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో స్వావలంబన ఎంతో కీలకమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ స్థాయి ఆర్థికతను మరింత వేగంగా చేరుకునే అవకాశాన్ని కల్పించేందుకు ఇంటెల్ సంస్థ తన వంతుగా సహకరాన్ని అందించేందుకు సిద్ధమైంది. బెంగళూరులో ప్రారంభించిన ఇంటెల్ ఆర్అండ్ డీ కేంద్రం రాష్ట్ర ఐటీ కీర్తిని మరింత పెంచుతుందని ఈ రంగంలో నిపుణులు లెక్కగడుతున్నారు.
దేశంలో రెండోది..
అమెరికా బయట ఇంటెల్ ఏర్పాటు చేసిన రెండు ఫెసిలిటీ కేంద్రాల్లో బెంగళూరు ఒకటి. ఇప్పటికే హైదరాబాద్లోనూ ఇంటెల్ కేంద్రం ఉంది. భారత్లో ఇప్పటి వరకు విస్తరించిన ఆర్అండ్డీ, నవ్యాలోచనల కేంద్రాల కోసం ఇంటెల్ సంస్థ ఎనిమిది బిలియన్ డాలర్లను వ్యయం చేసింది. అందులో 50 శాతం నిధులు బెంగళూరు కేంద్రానికి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెమీకండక్టర్ విధానం అమలు కోసం చేసే రూ.72 వేల కోట్ల నిధుల్లోనూ ఇంటెల్ కీలక లబ్ధిదారు కానుంది. సెమీకండక్టర్ ప్రొడక్ట్ డిజైన్ ఇన్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్లో దేశీయ నవ్యాలోచనలకు ఈ సంస్థ వేదిక కల్పించనుంది. ఇక్కడి ఆర్అండ్డీ ప్రయోగశాలలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచ విపణి అత్యంత సులువుగా ద్వారాలు తెరుస్తుంది. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ఇంటెల్ వినియోగదారులకు ఈ ఫెసిలిటీ కేంద్రం కస్టమైజ్డ్ డిజైన్ ఇంజినీరింగ్ ఉత్పత్తులు త్వరితగతిన ఇవ్వగలదు. 2021 వరకు ఇంటెల్ డిజైన్ చిప్ల కోసం నెలల తరబడి వేచి ఉండే సమయం ప్రస్తుతం వారాలకు పరిమితం కానుంది.
సాంకేతిక రంగ నాయకత్వం
ఇంటెల్ కొత్త కేంద్రంతో బెంగళూరు సాంకేతిక రంగ నాయకత్వం మరింత బలపడనుంది. కేంద్ర, రాష్ట్రాలు అందించే పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇంటెల్ వంటి మరిన్ని ప్రపంచశ్రేణి సంస్థలకు భరోసా కల్పిస్తున్నాయి. సెమీకండక్టర్ ఉత్పాదన కొరతను ఇంటెల్ ఫెసిలిటీ కేంద్రం తీర్చటమే కాదు.. ఎగుమతి సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ రంగంలో అంకురాలకు కూడా ఇంటెల్ సంస్థలు స్ఫూర్తి నింపుతాయి.
- రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మంత్రి
ఉత్పాదన వాతావరణం
బెంగళూరులో ఇంటెల్ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచుకునే వాతావరణం ఉంది. ఇక్కడి సాంకేతిక పర్యావరణ వ్యవస్థలు, ప్రపంచ స్థాయి మార్కెట్ సదుపాయం, సమర్థమంతమైన డేటా సెంటర్ వ్యవస్థలు ఉత్పాదకతను వేగవంతం చేస్తాయి. దేశీయ డిజైన్ అండ్ ఇంజినీరింగ్ ఆవిష్కరణలో ఇంటెల్ భాగస్వామ్యం సుదీర్ఘకాలం పాటు కొనసాగనుంది.
- నివృతి రాయ్, ఇంటెల్ ఇండియా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం