పర్యావరణానికి కాయకల్ప చికిత్స
అటవీ ఉత్పత్తులు పెంచేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. విధానసౌధ బాంక్వెట్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన అటవీ అభివృద్ధి మండలి
విశ్రాంతి అధికారులను సత్కరించిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తదితరులు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : అటవీ ఉత్పత్తులు పెంచేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. విధానసౌధ బాంక్వెట్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన అటవీ అభివృద్ధి మండలి సువర్ణ మహోత్సవాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సంరక్షణ పెద్ద సవాల్గా మారిందన్నారు. పర్యావరణ రక్షణకు కాయకల్ప చికిత్స చేసి.. చక్కని వాతావరణాన్ని ఆవిష్కరించాలన్నారు. పరిసరాలను కాపాడకపోతే అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అటవీ ఉత్పత్తుల సాధనతో ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఈ విభాగానికి దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. నీలగిరి వనాల పెంపకం వాతావరణంపై తీవ్రప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారని గుర్తుచేశారు. వాటి పెంపకం వల్ల అటవీ ప్రదేశాలు నాశనం కావడంతో పాటు భూగర్భ నీటి మట్టం నాశనమవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉమేశ్ కత్తి, ఆర్.అశోక్, ఎంపీ పీసీ మోహన్, మండలి అధ్యక్షురాలు తారా అనురాధ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ సంరక్షణకు శ్రమించిన మాజీ అధికారులను సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!