చీకటి రోజును ఎవరూ మరవరు
స్థానిక వాల్మీకి కూడలిలోని భాజపా కార్యాలయంలో శనివారం అత్యయిక పరిస్థితి విధించిన దినం (చీకటి రోజు) నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మురహరగౌడ, మంత్రి బి.శ్రీరాములు, శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్, లోక్సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, మండలి అధ్యక్షుడు
కారటగి : అత్యవసర పరిస్థితిని అనుభవించిన వారిని సత్కరించిన భాజపా నాయకులు
బళ్లారి, న్యూస్టుడే : స్థానిక వాల్మీకి కూడలిలోని భాజపా కార్యాలయంలో శనివారం అత్యయిక పరిస్థితి విధించిన దినం (చీకటి రోజు) నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మురహరగౌడ, మంత్రి బి.శ్రీరాములు, శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్, లోక్సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, మండలి అధ్యక్షుడు హనుమంతప్ప, బుడా అధ్యక్షుడు పి.పాలన్న పాల్గొని భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యయిక పరిస్థితుల్లో దేశంలో శాంతిభద్రతల కోసం శ్రమించిన గణేశ్, సుబ్బరావ్, వీరస్వామి, బసవరాజ్ తదితరులను సన్మానం చేసి అభినందించారు. కార్యక్రమానికి పలువురు హజరయ్యారు.
హొసపేటె : తమ స్వార్థం కోసం కాంగ్రెస్ పాలకులు 45 ఏళ్ల కిందట అమలు చేసిన అత్యయిక రోజులను భారతీయులెవరూ మరవలేరని భాజపా సీనియర్ నాయకుడు, హుడా అధ్యక్షుడు అశోక్ జీరె పేర్కొన్నారు. శనివారం హొసపేటెలోని పార్టీ కార్యాలయంలో అత్యయిక దినోత్సవాన్ని కరాళ దినోత్సవంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అత్యయిక రోజుల్లో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరించిందని వాపోయారు. ఆ రోజులు మళ్లీ ఎప్పటికీ మనకి రాకూడదన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అశోక్ జీరెను సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అనంతపద్మనాభ స్వామి, సాలి సిద్ధయ్య స్వామి, అయ్యాళి తిమ్మప్ప, కె.ఎస్.రాఘవేంద్ర, శశిధర స్వామి, శంకర్ మేటి తదితరులు పాల్గొన్నారు.
కారటగి : తాలూకాలోని బూదగుంప భాజపా కార్యాలయంలో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా శనివారం కార్యక్రమం జరిపారు. మొక్కకు నీరు పోసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్య భారతావనికి చీకటి రోజులు. ఎదురు తిరిగిన వారిని జైళ్లలో పెట్టారు. పత్రికా స్వేచ్ఛను హరించారు. 1975 జూన్ 25 నుంచి 21 నెలలపాటు ఈ పరిస్థితి కొనసాగిందన్నారు. ఆ సమయంలో బాధలు అనుభవించిన పలువురిని సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు రవిరాజ అరళి, రమేశ్ నాడగేర, రవిచంద్ర, మౌనేశ్ దడేసుగూరు తదితరులు పాల్గొన్నారు.
హొసపేటె : అత్యయిక పరిస్థితులను గురించి వివరించిన పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ జీరెను
సన్మానిస్తున్న కార్యకర్తలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!