లక్ష్య సాధనకు కృషి చేయండి
యువతీ, యువకులు చదువుకునే రోజుల్లోనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడే అనుకున్నది సాధిస్తారని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు విద్యార్థులకు సూచించారు. శనివారం బళ్లారి సరళాదేవి సతీశ్చంద్ర అగరవాల్ డిగ్రీ కళాళాశాలో కమిషన్ అధ్యక్షురాలు విద్యార్థులతో సంవాద
మాట్లాడుతున్న మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళనాయుడు
బళ్లారి, న్యూస్టుడే : యువతీ, యువకులు చదువుకునే రోజుల్లోనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడే అనుకున్నది సాధిస్తారని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు విద్యార్థులకు సూచించారు. శనివారం బళ్లారి సరళాదేవి సతీశ్చంద్ర అగరవాల్ డిగ్రీ కళాళాశాలో కమిషన్ అధ్యక్షురాలు విద్యార్థులతో సంవాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఆర్థికంగా బలపడాలి. డిగ్రీ పట్టాలు పొందాలి. బయటకు వచ్చిన తర్వాత స్వావలంబన జీవనం సాగించాలి. రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. విద్యార్థి జీవితం ఓపికగా.. సరైన మార్గంలో వెళ్లినప్పుడు ఆదర్శవంతమైన వ్యక్తి అవుతారన్నారు. ప్రేమ, అభిమానం అని జీవితాలను నాశనం చేసుకో వద్దని సూచించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మన దేశం సమానత్వం కోసం పోరాడుతూనే ఉందన్నారు. మహిళలు కేవలం నాలుగు గోడల మధ్య జీవనం గడుపుతున్నారు. మహిళలు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకొని జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉపనిర్దేశకులు విజయ్కుమార్, కళాశాల ప్రధాన ఆచార్యులు డా.ఆర్.ఎం.శ్రీదేవి మాట్లాడారు. కార్యక్రమంలో సీడీసీ సభ్యులు పద్మావతి, శైలజా, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
కేంద్ర కారాగారం పరిశీలన
కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు శనివారం మధ్యాహ్నం కేంద్ర కారాగారాన్ని పరిశీలించారు. మహిళా ఖైదీలు ఉంటున్న బ్లాక్లను పరిశీలించి, అక్కడ ఖైదీలతో మాట్లాడారు. ఏ కారణాలతో జైలుకు వచ్చారు.. వారు చేసిన తప్పులను తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలకు ప్రతినిత్యం అందించే ఆహారం తదితర వాటిని కూడా పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖËర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’