ఖరీఫ్కు లక్ష్యం మెండు
నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడం.. ముఖ్యంగా తొలి ముంగారు వానలు విస్తారంగా కురవడం తదితర పరిస్థితులు ఖరీఫ్ సాగుకు అనుకూల వాతావరణాన్ని మోసుకొచ్చాయి. ఫలితంగా ఖరీఫ్ సాగు లక్ష్యాన్ని 82.666 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. ఇప్పటికే 16.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటల్ని సాగుచేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
82 లక్షల హెక్టార్లకు పైగా సాగు ప్రణాళిక
రాష్ట్ర వ్యాప్తంగా వడివడిగా సేద్యం పనుల జోరు
బెంగళూరు (ఎలక్ట్రానిక్ సిటీ), న్యూస్టుడే : నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడం.. ముఖ్యంగా తొలి ముంగారు వానలు విస్తారంగా కురవడం తదితర పరిస్థితులు ఖరీఫ్ సాగుకు అనుకూల వాతావరణాన్ని మోసుకొచ్చాయి. ఫలితంగా ఖరీఫ్ సాగు లక్ష్యాన్ని 82.666 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. ఇప్పటికే 16.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటల్ని సాగుచేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ఖరీఫ్ సాగు విస్తీర్ణం అధికమవుతుందని చెప్పారు. విద్యుత్తు ప్రాజక్టులు మినహా ఇతర సాగునీటి ప్రాజక్టుల్లో చాలినంత నీటి నిల్వలు ఉన్నట్లు తెలిపారు. ఈ కారణంగానే అనేక రిజర్వాయర్ల కింద వరి నారుమళ్ల తయారీలో రైతులు నిమగ్నమయ్యారు. కావేరి పరీవాహక ప్రాంతంలో ఇటీవలి కాలంలో కురిసిన వర్షాలకు కృష్ణరాజసాగర జలాశయంలో క్రమేపీ నీటి నిల్వలు అధికమవుతున్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో నారాయణపుర జలాశయం పరిధిలో అనేక గ్రామాల్లో హెచ్చరికల్ని జారీ చేశారు. నది వద్దకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని చాటింపు వేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
ః ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో పొద్దుతిరుగుడు పంట విస్తీర్ణం పెరిగింది. రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కారణంగా దేశంలో వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకడంతో రైతులు ఆర్థికంగా ఆదుకుంటుందనే ఉద్దేశంతో సంప్రదాయ పంటలకు బదులుగా పొద్దుతిరుగుడు, సోయా తదితర పంటల సాగుకు మొగ్గుచూపుతున్నట్లు అధికారులు తెలిపారు. బీదర్ జిల్లాలో గత ఏడాది 1.82 లక్షల హెక్టార్లలో సోయా సాగుకు చేయగా ఈ ఏడాది 2.6 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని సంకల్పించారు. కలబురగి జిల్లాలో గత ఏడాది 12 వేల హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది అది 30 వేల హెక్టార్లకు చేరుకోనుంది. మన దేశానికి అవసరమైన నూనెగింజల్లో 90 శాతం ఉక్రెయిన్, రష్యాల నుంచే దిగుమతి అవుతున్న నేపథ్యంలో యుద్ధం కారణంగా దిగుబడులు పూర్తిగా నిలిచిపోయాయి. కల్యాణ కర్ణాటకలో నూనెగింజల పంటల హవా కొనసాగుతోంది. రాయచూరు జిల్లాలో గతంలో పొద్దుతిరుగుడు పంట 3500 హెక్టార్లకు మించేదికాదు. ఈ ఏడాది 17 వేల హెక్టార్లకు పైగా సాగు నమోదయ్యే అవకాశాలున్నాయి. హుబ్బళ్లి, హావేరి, గదగ తదితర జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. రాష్ట్రంలో సాధారణంగా పొద్దుతిరుగుడు పంటలను 73,300 హెక్టార్లలో సాగు చేసేవారు. దీన్ని ఈ ఏడాది 96,953 హెక్టార్లకు పెంచారు. ఇతర నూనె గింజల పంటలు కూడా ఇదే దామాషాలో పెరిగాయి.
ఆదుకుంటున్న బొప్పాయి
ఇటీవలి కాలంలో రైతులను ఆదుకునే పంటగా బొప్పాయి పంట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇతర పంటలతో పోలిస్తే ఏడాదిలోపే అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంటగా దీనికి గుర్తింపు లభించింది. మొన్నటి వరకు థైవాన్ రెడ్ రకాన్ని ఎక్కువగా సాగు చేసేవారు. ఇప్పుడనేక రకాలు తోడవడంతో కాస్తంత నీటి సదుపాయం ఉండే ప్రాంతాల్లో కూడా బిందు సేద్యం ఆధారంగా ఈ పంట సాగును చేపట్టారు. కొబ్బరి తోటతో ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పుడా తోటల్లో అంతర పంటగా వక్క మొక్కల్ని పెంచేందుకు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో పొద్దుతిరుగుడు పంట సాగుకు సానుకూల పరిస్థితులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం