రాజధానికి సింగపూర్ సొబగులు!
విధానసౌధ ఆవరణలో నాడప్రభు కెంపేగౌడ విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. కెంపేగౌడ జయంతిని పురస్కరించుకుని విధానసౌధ బాంక్వెట్ హాల్లో ‘కెంపేగౌడ అంతర్జాతీయ పురస్కారాల’
సంబరం: ఎస్.ఎం.కృష్ణ, సుధానారాయణమూర్తి ప్రకాశ్ పదుకొణె విమల్కుమార్కు కెంపేగౌడ పురస్కారాల ప్రదానం
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : విధానసౌధ ఆవరణలో నాడప్రభు కెంపేగౌడ విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. కెంపేగౌడ జయంతిని పురస్కరించుకుని విధానసౌధ బాంక్వెట్ హాల్లో ‘కెంపేగౌడ అంతర్జాతీయ పురస్కారాల’ను సోమవారం ప్రదానం చేసి మాట్లాడారు. బెంగళూరు నగర నిర్మాత విగ్రహాన్ని ఇప్పటి వరకు విధానసౌధ ఆవరణలో ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని అన్నారు. వచ్చే జయంతి నాటికి ఆ పని పూర్తి చేస్తామని ప్రకటించారు. శతాబ్దాల కిందటే రాజులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లేవారని- కెంపేగౌడ మాత్రం బెంగళూరుకు కావలసిన సదుపాయాలన్నీ కల్పించడానికే శ్రద్ధ చూపారని గుర్తు చేశారు. ఆయన పాలన సువర్ణయుగమని, ప్రజలే ఆయన్ను నాడప్రభు అని పిలుచుకునే వారని వివరించారు. పాలించడానికి, పాలనకు తేడా చాలా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బెంగళూరుకు ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలను కల్పించవలసిన బాధ్యత పాలకులదేనని పేర్కొన్నారు. రానున్న 40 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని, మౌలిక సదుపాయాల వృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని వివరించారు. ఇప్పటి ఉద్యాననగరిలో 400కు పైగా ప్రపంచ స్థాయి పరిశోధన కంపెనీలు, 400 ఫార్చ్యూన్ కంపెనీలు ఉండగా, దేశానికి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో 43 శాతం కర్ణాటకకే చెందినట్లు గుర్తు చేశారు. ఎస్.ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలతోనే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా బెంగళూరు నిలిచిందని ప్రశంసించారు. బెంగళూరును సింగపూర్గా మార్చేందుకు ప్రజల సహకారమూ అవసరమన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో 108 అడుగుల ఎతైన కెంపేగౌడ విగ్రహాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
వక్కలిగర సంఘలో ప్రదర్శించిన కెంపేగౌడ విజయచరిత్రపై ఆకట్టుకున్న నృత్యరూపకం
అధ్యయన పీఠం..
బెంగళూరు విశ్వవిద్యాలయం ఆవరణలో కెంపేగౌడ అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి డాక్టర్ అశ్వత్థ నారాయణ తెలిపారు. రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న పీఠానికి ఇప్పటికే రూ.50 కోట్లు విడుదల చేశామన్నారు. ఒక్కలిగ అభివృద్ధికి రూ.150 కోట్లు విడుదల చేసి నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కెంపేగౌడ స్వాతంత్య్ర యోధుడని మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మైసూరు, కలబురగి, ధార్వాడ, శివమొగ్గ తదితర నగరాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బగా కెంపేగౌడ పురస్కారం కింద తనకు ఇచ్చిన రూ.5 లక్షల నగదు పురస్కారాన్ని రామకృష్ణ ఆశ్రమానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి బదులుగా ఆయన భార్య సుధామూర్తి పురస్కారాన్ని అందుకున్నారు. నగరంలో వాహన రద్దీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె ప్రశంసించారు. బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్ పదుకొణె తరపున విమల్కుమార్ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ మఠాల ప్రతినిధులు నిర్మలానందనాథ స్వామి, నంజావధూత స్వామి, చంద్రశేఖర స్వామి, మంత్రులు అశోక్, గోపాలయ్య, సునీల్ కుమార్, మునిరత్న, లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య, పలువురు ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఒకేతాటిపైకి..
కెంపేగౌడ జయంతి సందర్భంగా అన్ని పార్టీల నేతలూ ఏకతాటిపైకి వచ్చారు. బెంగళూరులో నిర్వహించిన జయంతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, ఆధ్యాత్మిక గురువులు నిర్మలానందనాథ స్వామి, నంజావధూత స్వామి, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సదానందగౌడ, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
బర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు