పుత్తడిబొమ్మపై రాక్షసత్వం
ముక్కుపచ్చలారని వయస్సు. పుత్తడిబొమ్మను తలపించే ఆమె (17)ను ఓ యువకుడి (25)కిచ్చి పెళ్లిచేస్తే.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై వికృత
చిత్రదుర్గం: ముక్కుపచ్చలారని వయస్సు. పుత్తడిబొమ్మను తలపించే ఆమె (17)ను ఓ యువకుడి (25)కిచ్చి పెళ్లిచేస్తే.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై వికృత లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఆమెపై ఆ నలుగురూ ప్రదర్శించిన రాక్షసత్వం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. కట్టుకున్నోడు చేసిన మానని గాయానికి కుమిలిపోతూ ఆమె ప్రస్తుతం చిత్రదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పట్టణ మహిళా పోలీస్ ఠాణా అధికారులు సోమవారం అందించిన సమాచారం ప్రకారం.. ఆ యువకుడు- బాలికకు ఇటీవలే పెద్దలు వివాహం చేశారు. ఆ బాల్య వివాహాన్ని ఎవరూ అడ్డుకోలేని నేపథ్యంలో ఆమె మెట్టినింట అడుగు పెట్టింది. దుష్టబుద్ధితో కదులుతున్న భర్త తీరును ఆమె గుర్తించలేక పోయింది. ఈనెల ఏడోతేదీన ఆమెను పథకం ప్రకారం.. పట్టణ శివార్లలోని మాళప్పనహట్టి రహదారి వద్దకు రప్పించాడు. అక్కడ ఏదో మాట్లాడాలంటూ సమీపంలోనే నిర్మాణంలో ఉన్న ఓ పెద్ద భవంతి వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే మరో ముగ్గురు వ్యక్తులున్నారు. కీడు గుర్తించేలోగా.. భర్తతో పాటు ఆ ముగ్గురూ ఆమెపై ఒక్కసారిగా దాడిచేశారు. అత్యంత పాశవికంగా సిగరెట్లతో కాల్చి.. ఒకరితరువాత ఒకరు లైంగిక దాడికి ఒడిగట్టారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ నిర్జన ప్రదేశంలో ఆమె అరుపులు అరణ్యరోదనలయ్యాయి. ప్రతిఘటించిన ఆమె తలపై బండరాయి వేసి గాయపరిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను రక్షించేవారే లేకపోయారు. ఆమెను కనీసం ఇంటికైనా చేర్చకుండా దుండుగులు తలోదిక్కు వెళ్లిపోయారు. చివరికి కొందరు ఆమె దైన్యస్థితి గుర్తించి బంధువులకు సమాచారం అందించడంతో వారు ఆసుపత్రికి తరలించారు. కదల్లేని స్థితిలో ఉన్న ఆమె ఆదివారం కొంత కుదుటపడింది. బంధువులు అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసు అధికారులు రంగంలోకి దిగి ఆమె నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు కేశారు. ఆ నలుగురిపైనా లైంగిక దాడి, హత్యాయత్నం, బాల్యవివాహ ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో