అడ్డగోలు తనిఖీల ఆటకట్టు
సిల్క్బోర్డ్ రహదారి నుంచి విధులకు వెళ్తున్న ఓ ఐటీ ఉద్యోగిని నిలిపిన ట్రాఫిక్ పోలీసులు వాహన పత్రాలను చూపించాలని అడిగారు. అంతటితో ఆగకుండా ఆ వాహన తాళాలను కూడా తీసుకుని పత్రాల పరిశీలనకు సిద్ధమయ్యారు. తన వద్ద ఉన్న అన్ని పత్రాలు పరిశీలించిన
వాహనదారులకు ఉపశమనం
ఈనాడు, బెంగళూరు
ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపే వీలులేదు
* సిల్క్బోర్డ్ రహదారి నుంచి విధులకు వెళ్తున్న ఓ ఐటీ ఉద్యోగిని నిలిపిన ట్రాఫిక్ పోలీసులు వాహన పత్రాలను చూపించాలని అడిగారు. అంతటితో ఆగకుండా ఆ వాహన తాళాలను కూడా తీసుకుని పత్రాల పరిశీలనకు సిద్ధమయ్యారు. తన వద్ద ఉన్న అన్ని పత్రాలు పరిశీలించిన పోలీసులు అన్ని సరిగా ఉన్నాయని చెప్పి వెళ్లమన్నారు. ఈ తతంగానికి 30 నిమిషాలు పట్టింది. తనవద్ద సరైన దాఖలాలుండీ అనవసరంగా సమయం వృథా చేసుకున్న ఆ ఉద్యోగి సంబంధిత ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
* బాణసవాడికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి వాహనాన్ని నెలలో ఆరుసార్లు నిలిపిన పోలీసులు పత్రాలను ప్రతిసారీ పరిశీలించారు. పరిశీలించిన ప్రతిసారీ ఏ ఒక్క ట్రాఫిక్ ఉల్లంఘనా నమోదు కాలేదు. ఆ బాధితుతు స్థానిక ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణలో పోలీసుల కర్తవ్య లోపం గుర్తించి విధుల నుంచి తొలగించారు.
* ఏడాది కిందట జాలహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వాహనం మాటున నక్కి ఉన్న పోలీసులు ఉన్నఫళంగా హెల్మెట్ లేని వాహనదారుడిపై దాడి చేశారు. ఆ వాహనదారు పట్టుతప్పి పడిపోవటంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ దురాగతానికి పాల్పడిన పోలీసుపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
* ఈ సంఘటనల్లో వాహనదారుల తప్పులకంటే సేవల్లో ఉన్న పోలీసుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం కనిపిస్తోంది. నిత్యం వాహనదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిగణించిన డీజీపీ ప్రవీణ్ సూద్ తాజాగా వెల్లడించిన ఆదేశం వాహనదారులకు కచ్చితంగా ఉపశమనం కలిగిస్తుంది.
ఇక వాటి ఆటకట్టు
ఇకపై రాష్ట్రవ్యాప్తంగా దాఖలాలను పరిశీలించే నిమిత్తం పోలీసులు వాహనాలను నిలిపే వీలులేదు. వాస్తవానికి ఈ ఆదేశం 2020 డిసెంబరులోనే ప్రకటించినా ఆచరణ సాధ్యం కాలేదు. ఓ వాహనదారుడు నేరుగా డీజీపీకి ట్వీట్ చేస్తూ ‘వాహనాలను అడ్డుకునే ప్రక్రియకు అడ్డుకట్టవేయాలని శ్రీవాత్సవ వాజపేయి అనే వాహదారుడు మనవి చేశారు. పోలీసుల చర్యలతో విలువైన సమయం వృథా అవుతుంది’ అని వివరించారు. ఇందుకు బదులిచ్చిన డీపీజీ.. ‘వాహనదారుడు నిబంధనలు ఉల్లంఘించినట్లు కెమెరాలో గుర్తించినా, స్వయంగా పోలీసులు పసిగడితే తప్ప వాహనాన్ని నిలపటం సరికాదు. మద్యం సేవించి వాహనాన్ని నడిపిన సందర్భంలో అన్ని పత్రాలను పరిశీలించాలి. ఈ నిబంధనను తక్షణమే అమలు చేయాల్సిందిగా ఆదేశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.
చెల్లింపులు అంతంతే
డీజీపీ తాజాగా వెల్లడించిన ఆదేశం వెనుక ఓ సౌలభ్యం కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వాహనానికి సంబంధించిన బకాయిలు (ప్రీమియం, ఉల్లంఘన జరిమానా) పేటీఎం ద్వారా చెల్లించే వెసులుబాటు ఉంది. వాహదారునికి ఎస్ఎంఎస్ ద్వారా చలానా చెల్లింపు సమాచారం అందుతుంది. వీటిని సక్రమంగా చెల్లిస్తే పోలీసుల తనిఖీల నుంచి దూరంగా ఉండొచ్చు. 2021-22 ఏడాదిలో రూ.450 కోట్లకుపైగా జరిమానాలు, ప్రీమియం చెల్లింపులు బకాయి పడినట్లు బెంగళూరు ట్రాఫిక్ నివేదిక వెల్లడించింది.
లోపాలూ దండి
వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించటం కొత్తేమీ కాదు. బెంగళూరు వంటి మహానగరంలో 13,500 కిలోమీటర్ల పొడవైన రహదారులుండగా, 44 వేల రహదారి కూడళ్లున్నాయి. వీటిల్లో 1,200 కూడళ్లు అత్యంత రద్దీతో కిటకిటలాడుతుంటాయి. 450కుపైగా సిగ్నల్స్ ఉన్నా ప్రస్తుతం స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పుణ్యమా అంటూ రహదారుల మళ్లింపులు పెరిగాయి. ఈ కారణంగా నగర పోలీసులు ఇష్టానుసారం వాహనాలను నిలుపుతూ దాఖలాలను తనిఖీ చేస్తున్నారు. వాహనాలను నిలిపివేయటం వల్ల పోలీసులు, వాహనదారుల విలువైన సమయం హరించుకుపోతోంది. ఈ కారణంగా 2020లోనే స్మార్ట్ ట్రాఫిక్ సర్వీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలైంది. బెంగళూరు నగరంలో 3,600 మంది పోలీసులకు కెమెరా ధరించిన యూనిఫార్మ్ (బాడీ వోర్ కెమేరా)లిచ్చారు. ఈ దస్తులను వేయ్యి మంది సక్రమంగా ధరించలేదని ఇటీవల హైకోర్టు వెల్లడించిన ఓ ఫిర్యాదుదారుని కేసులో తేలింది. బాణసవాడి పోలీసు స్టేషన్ నమోదైన సంఘటనలోనూ కెమెరా ధరించని పోలీసులపైనే చర్యలు తీసుకోవటం గమనార్హం. ఈ కెమెరాల్లో బంధించే చిత్రాల ద్వారా నిబంధనలు ఉల్లంఘించిన వారిని నేరుగా తనిఖీ చేయాలన్న నిబంధనను పాటించే పోలీసులు తక్కువగా ఉన్నారన్న వాదన వినిపిస్తోంది.
ప్రీమియంలకు అనుసంధానం..
వాహనదారులు బకాయిపడ్డ జరిమానాలను ప్రీమియంలు, రెన్యువల్, ఇతర రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించే విధానాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని కోరాం. వీటితో ఈ-చెల్లింపులు వేగవంతం అవుతాయి. కరోనా తర్వాత సొంత వాహనాల వాడకం పెరిగిన కారణంగా ఉల్లంఘనలు పెరిగాయి. పోలీసు వ్యవస్థ నాజూకు విధానాలను పరిచయం చేసినా వినియోగదారుల నుంచి స్పందన అంతంతే.
- బి.ఆర్.రవికాంతేగౌడ, జేసీపీ, ట్రాఫిక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!