గంజాయి దహనం
అంతర రాష్ట్రీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బళ్లారి, విజయనగర జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 89.670 కిలోల గంజాయిని ఆదివారం కాల్చివేశారు. ఉమ్మడి జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, 30
బళ్లారి, న్యూస్టుడే: అంతర రాష్ట్రీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బళ్లారి, విజయనగర జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 89.670 కిలోల గంజాయిని ఆదివారం కాల్చివేశారు. ఉమ్మడి జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, 30 కేసులు నమోదు చేశారు. రూ.10,97,872 విలువైన 89.670 కిలోల గంజాయి, రూ.5.70లక్షలు విలువైన 11 గ్రాముల ఎల్.ఎస్.డి.ని పట్టుకున్నారు. ఎస్పీ సైదులు అడావత్ ఆదేశాలతో, నగర డీఎస్పీ రమేష్కుమార్ నేతృత్వంలో పోలీస్ అధికారులు విశ్వనాథ కులకర్ణి తదితరులు బళ్లారి తాలూకా హరగినడోణి గ్రామం సమీపంలోని బయో మెడికల్ వ్యర్థాల ప్లాంట్లో కాల్చివేశారు.
చెళ్లకెరె(చిత్రదుర్గం): మొళకాల్మూరు తాలూకాలో రెండేళ్ల క్రితం పోలీసులు స్వాధీనం చేసుకొన్న 9.83 టన్నుల గంజాయి మొక్కలను దావణగెరె తూర్పు వలయం ఐజీపీ త్యాగరాజన్ నేతృత్వంలో పోలీసు అధికారులు రాంపుర గ్రామం వద్ద గల వ్యర్థపదార్థాల నిర్వహణ కేంద్రంలో దహనం చేసినట్లు జిల్లా ఎసీˆ్ప పరశురాం తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల మేరకు.. నాశనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.4.01 కోట్లని చెప్పారు. దీంతోపాటు జిల్లాలో 5 ప్రత్యేక సంఘటనల్లో స్వాధీనం చేసుకొన్న 9.87 కిలోల గంజయిని కూడా దహనం చేసి నాశనం చేశామన్నారు. డీవైఎస్పీ శ్రీధర్, సీఐ సతీశ్, ఎస్ఐ గాదిలింగప్ప, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.