అవును.. వారు అడవిని పెంచారు!
ఆ గ్రామస్థులు.. ఇతర అనేక గ్రామాల ప్రజలకు ఆదర్శం. అక్కడి వారంతా అడవిని పెంచి, పోషిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకా తాళగుప్ప ఫిర్కాలోని హుణసూరు ఓ కుగ్రామం. ఐదు దశాబ్దాల కిందటే ఈ కుగ్రామం ఏర్పడింది.
అడవిని పరిశీలిస్తున్న గ్రామస్థులు
శివమొగ్గ, న్యూస్టుడే : ఆ గ్రామస్థులు.. ఇతర అనేక గ్రామాల ప్రజలకు ఆదర్శం. అక్కడి వారంతా అడవిని పెంచి, పోషిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకా తాళగుప్ప ఫిర్కాలోని హుణసూరు ఓ కుగ్రామం. ఐదు దశాబ్దాల కిందటే ఈ కుగ్రామం ఏర్పడింది. గ్రామస్థుల ప్రధాన వ్యాపకం వ్యవసాయం. వర్షాలు కురిసినప్పుడు మాత్రమే సేద్యం లాభదాయకంగా ఉండేది. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొనాల్సి వచ్చింది. గొట్టపు బావులు తవ్వుకోవాలంటే గంగమ్మ పాతాళానికి చేరుకుంది. అలాంటి పరిస్థితుల్లో అడవుల పెంపకమే తమ సమస్యకు శాశ్వత పరిష్కారమని గుర్తించారు. గ్రామానికి సమీపంలోని 83 ఎకరాల్లో వివిధ రకాల మొక్కల్ని నాటారు. కలప మొక్కలే కాకుండా పండ్ల మొక్కల్ని నాటారు. నాటడడంతోనే చేతులు దులుపుకోకుండా కట్టుబాట్లను ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరూ ఆ ప్రాంతంలోకి వెళ్లరాదని కట్టడి చేశారు. అలా వెళ్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. అలా రెండు దశాబ్దాలు గడిచాయి. ప్రస్తుతం ఆనాడు నాటిన మొక్కలు ఓ అడవిలా తయారయ్యాయి. ఏపుగా పెరిగిన ఆ ప్రాంతాన్ని చూస్తే పడమటి కనుమల్లోని అడవులు గుర్తుకు వస్తాయి. అడవిలో ఏదేని చెట్టు కూలినా దాన్ని తొలగించడానికి వీలులేదు. ఈ కారణంగానే అడవిలోకి వెళ్లి చూస్తే విరిగిన కొమ్మలు అక్కడే పడి ఉంటాయి. అడవి అభివృద్ధితో గ్రామంలో భూగర్భ జలాల పరిస్థితి గణనీయంగా అభివృద్ధి చెందినట్లు గ్రామస్థుడు కన్నప్ప తెలిపారు. అడవిని సంరక్షించడమే తమ ధ్యేయమని చెప్పారు. హుణసూరు గ్రామస్థుల శ్రమకు తాము పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM