పాఠ్య పుస్తకం.. వివాదాలే సమస్తం
రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలను వివాదాలు చుట్టుముట్టాయి. ఒకటో తరగతి నుంచి పది వరకు పుస్తకాల్లో పాఠ్యాంశాల మార్పునకు సంబంధించి ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. రోహిత్ చక్రతీర్థ నేతృత్వంలోని సమితి రూపొందించిన పాఠాలపై సాహితీవేత్తలు, విద్యావేత్తలు విమర్శలు గుప్పించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కొత్తగా చేసిన మార్పులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరగతులు ప్రారంభమై నెల అవుతున్నా..
బెంగళూరు జయనగరలో రక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న
రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్, ఎంపీ తేజస్వీసూర్య, సంఘ సేవకురాలు తేజస్వినీ అనంతకుమార్, తదితరులు
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలను వివాదాలు చుట్టుముట్టాయి. ఒకటో తరగతి నుంచి పది వరకు పుస్తకాల్లో పాఠ్యాంశాల మార్పునకు సంబంధించి ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. రోహిత్ చక్రతీర్థ నేతృత్వంలోని సమితి రూపొందించిన పాఠాలపై సాహితీవేత్తలు, విద్యావేత్తలు విమర్శలు గుప్పించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కొత్తగా చేసిన మార్పులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరగతులు ప్రారంభమై నెల అవుతున్నా.. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వ వైఫల్యంతోనే పాఠ్యాంశాల రూపకల్పన, పుస్తకాల ముద్రణ జాప్యమైందని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శించారు. కొత్త పాఠ్యాంశాలకు ఆమోదం లభించినా, వాటి ముద్రణకు కనీసం ఆరు వారాల సమయం పడుతుందని ప్రచురణకర్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. అభ్యంతరాలు వ్యక్తమైన ఎనిమిది అంశాలను సవరించడంతో పాటు, బాలలకు వారి వయసుకు తగిన పాఠాలను మాత్రమే పుస్తకాల్లో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
‘కనకదాస’ భాగ్యం..
● తొమ్మిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో కనకదాస జీవిత చరిత్ర పాఠాన్ని కొనసాగించాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి బొమ్మై సూచనలు చేశారు. ఇప్పటి వరకు విద్యార్థులకు బోధిస్తూ వచ్చిన పాఠాన్ని ఈ విద్యాసంవత్సరమూ కొనసాగించాలని తన సూచనల్లో పేర్కొన్నారు. తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకం నుంచి కనకదాసుని జీవిత చరిత్ర పాఠాన్ని తొలగించారని కాగినెల కనకపీఠం ప్రతినిధి నిరంజనానందపురి స్వామి తప్పుపట్టడం ప్రస్తావనార్హం. ఆ పాఠాన్ని తొలగించకూడదని ముఖ్యమంత్రి బొమ్మైను గత శనివారం కలుసుకుని వినతి పత్రాన్ని అందించారు. కనకదాస చరిత్రను పూర్తిగా తొలగించి, ఏకవాక్యానికి దాన్ని పరిమితం చేయడం పై మఠాధిపతి ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. కనకదాస ఆదర్శాలు, దార్శనికతను విద్యార్థులకు తెలియజేకుండా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, పూర్తి పాఠాన్ని కొనసాగించాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి లిఖిత సూచనలు చేశారు.
ఫిర్యాదుల పెట్టె..
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యా శాఖకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు కొత్త వెబ్సైట్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలు అడిగే ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి బి.సి.నాగేశ్, ఇతర ఉన్నతాధికారులు బదులివ్వనున్నారు. తమ శాఖను మరింత పారదర్శకంగా తీర్చి దిద్దేందుకు, విద్యార్థులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఈ కొత్త పోర్టల్ను ప్రారంభిస్తున్నామని నాగేశ్ తెలిపారు. పోర్టల్కు అనుబంధంగా ట్విటర్, ఫేస్బుక్లోనూ తమ శాఖకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ