logo

బిడ్డలను హతమార్చి.. తల్లి ఆత్మహత్య

భర్త మరొక మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని ఆమె సహించలేకపోయింది. అన్నీ ఆమెకే దోచిపెడతాడని ఆందోళన చెందింది. అలాంటి పరిస్థితుల్లో తన పిల్లలు అనాథలుగా బతకడం కంటే తనతో పాటు మృత్యువాత పడితేనే మేలనుకుందేమో..

Published : 29 Jun 2022 04:07 IST


అక్కాచెల్లెళ్లు (పాతచిత్రం)

మైసూరు, న్యూస్‌టుడే : భర్త మరొక మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని ఆమె సహించలేకపోయింది. అన్నీ ఆమెకే దోచిపెడతాడని ఆందోళన చెందింది. అలాంటి పరిస్థితుల్లో తన పిల్లలు అనాథలుగా బతకడం కంటే తనతో పాటు మృత్యువాత పడితేనే మేలనుకుందేమో.. కూతుళ్లిద్దరినీ ఉరివేసి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఉరి వేసుకుంది. ఈ ఘటన మైసూరు జిల్లా టి.నరసీపుర తాలూకా రామేగౌడనపురలో చోటుచేసుకున్నట్లు మంగళవారం ఇక్కడ పోలీసులు తెలిపారు. మృతులను సరోజా (32), గీతా (6), కుసుమ (4)గా గుర్తించారు. తాలూకాలోని మావినహళహళ్లికి చెందిన నింగరాజు అనే వ్యక్తితో సరోజకు వివాహమైంది. ఇటీవల మరొక మహిళతో భర్త సన్నిహితంగా ఉండడాన్ని సహించలేక ఇద్దరూ తరచూ గొడవపడేవారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ఆమె తన పిల్లలతో కలిసి పుట్టింటికి చేరుకుంది. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముందుగా పిల్లలిద్దరికీ ఉరి వేసింది. అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. టి.నరసీపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని