అభయారణ్యంలో నిఘాకళ్లు
రాష్ట్రంలో బండీపుర అభయారణ్యం తరువాతి స్థానంలో ఉన్న నాగరహొళె వనసీమలో అక్రమాల అడ్డుకట్టకు అధికారులు నడుం బిగించారు. వన్యప్రాణుల సంచారం, అడవి దొంగల చొరబాటు.. వివిధ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తగిన రీతిలో చర్యలు తీసుకునేందుకు వీలుగా నిఘా కెమేరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మైసూరు, న్యూస్టుడే : రాష్ట్రంలో బండీపుర అభయారణ్యం తరువాతి స్థానంలో ఉన్న నాగరహొళె వనసీమలో అక్రమాల అడ్డుకట్టకు అధికారులు నడుం బిగించారు. వన్యప్రాణుల సంచారం, అడవి దొంగల చొరబాటు.. వివిధ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తగిన రీతిలో చర్యలు తీసుకునేందుకు వీలుగా నిఘా కెమేరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చాయి. అభయారణ్యంలో 500 కెమేరాల్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులతో ఇందుకు సంబంధించి ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఓ రిసార్ట్ నిర్వాహకుడుగా గుర్తింపు పొందిన టైగర్ రమేశ్ నాయకత్వంలో ఈ వినూత్న పథకానికి చేయూతనివ్వాలని తీర్మానించారు. ప్రతీ మూడు రోజులకొకసారి అటవీ సిబ్బంది కెమేరాలలోని చిప్లలో నిక్షిప్తమైన వివరాల్ని తమ ల్యాప్టాప్ల్లోకి డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ సమాచారాన్ని క్రోడీకరించి ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికారుల నుంచి సూచనలు పొందడానికి వీలుంటుంది. ఇప్పటికే ఈ సంస్థలు బండీపుర అభయారణ్యానికి 300, దాండేలిలో వంద కెమేరాలను అమర్చడం తెలిసిందే. నాగరహొళె అభయారణ్యంలో ఇప్పటికే నాలుగు వందల కెమేరాల్ని కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ అడవిలో ప్రస్తుతం 135 పులులు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల నిర్వహించిన తాజా పులి గణన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. మరో 10- 15 వరకు పులుల సంఖ్య అధికమవుతుందని భావిస్తున్నారు. కెమెరాల ఏర్పాటుతో అడవిదొంగల్ని ఆటకట్టించవచ్చని అధికారులు తెలిపారు. అడవిలో విలువైన కలపను దొంగిలించడంతో పాటు వన్యప్రాణుల్ని వేటాడుతుంటారని సమాచారం ఉన్నప్పటికీ ఆ దొంగల గురించిన వివరాలు తెలియడం లేదు. అడవి అంచుల్లోని గ్రామాల్లో సందేహంతో కొందరిని అదుపులోనికి తీసుకుని విచారిస్తుంటారు. అనేక సందర్భాల్లో తగిన సాక్ష్యాలు లేనందున అసలైన నిందితులే తప్పించుకుంటున్నారు. తాజా నిఘాతో ఆ దుండగుల చిత్రాలు రికార్డు కానున్నందున ఇకముందు అక్రమాలకు కళ్లెం వేయవచ్చని సంబంధిత అధికారి ఒకరు వివరించారు.
వన్యజీవుల కదలికను గుర్తించే నిఘా కెమెరా
అభయారణ్యానికే ఆకర్షణగా నిలిచే నల్లని చిరుత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
బర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి