జిల్లా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
జిల్లా ఆసుపత్రి ఎన్.ఐ.సి. పిల్లల వార్డులో మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా అగ్ని ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన హోంగార్డులు, విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బంది, వైద్యులు చొరవతో నవజాత శిశువులను సురక్షితంగా రక్షించారు. దీంతో బయట ఉన్న బాలింతలు, వైద్యులు ఊపిరిపీల్చుకున్నారు.
14 మంది నవజాత శిశువులు సురక్షితం
బళ్లారి, న్యూస్టుడే: జిల్లా ఆసుపత్రి ఎన్.ఐ.సి. పిల్లల వార్డులో మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా అగ్ని ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన హోంగార్డులు, విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బంది, వైద్యులు చొరవతో నవజాత శిశువులను సురక్షితంగా రక్షించారు. దీంతో బయట ఉన్న బాలింతలు, వైద్యులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువులు, న్యుమోనియా, శ్వాసకోశ, నెలలు నిండకుండా జన్మించిన వారు, బరువు తక్కువున్న వారికి చికిత్స అందజేయడానికి ఎన్.ఐ.సి వార్డును ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆ వార్డులో 14 మందికిపైగా శిశువులు చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో వార్డులో విద్యుత్తు బోర్డు వేడెక్కి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డులు, ఆరోగ్య సిబ్బంది, వైద్యులు, వైద్య విద్యార్థులు గుర్తించి పిల్లలను రక్షించి మంటలను అదుపుచేశారు. ఒక్కసారిగా వార్డులో పొగలు కమ్ముకున్నాయి. జిల్లా ఆసుపత్రి బాధ్యుడు డా.బసరెడ్డి, తదితర వైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హోంగార్డుల సాయంతో పెద్ద ప్రమాదం తప్పడంతో వైద్యులు, అధికారులు, పిల్లలు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై జిల్లా ఆసుపత్రి బాధ్యుడు డా.బసరెడ్డి ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ అగ్నిప్రమాదాన్ని తక్షణమే గుర్తించి మంటలను ఆర్పివేశారు. ఎన్.ఐ.సి వార్డులో చికిత్స పొందుతున్న 14 మంది చిన్నారుల్లో 13 మందికి పక్కనే మరో వార్డును సిద్ధం చేసి అక్కడే చికిత్స ప్రారంభించార. మరో శిశువుకు వెంటిలేటర్ అవసరం కాగా, విమ్స్కు తరలించినట్లు తెలిపారు. వారంలోపు మరమ్మతులు చేయించి యథాప్రకారం చికిత్స ప్రారంభిస్తామన్నారు.
మంటలకు పడిపోయిన పైకప్పు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ