ఆరు నెలలు.. 60 సినిమాలు!
మరికొన్ని రోజులు గడిస్తే ఏడాదిలో అప్పుడే ఆరునెలలు పూర్తైనట్లే. కరోనా ఆంక్షల నుంచి గట్టెక్కిన తరువాత చందనసీమకు పూర్వవైభవం లభిస్తుందని భావించిన సినీ వర్గాలకు ఆశించిన స్థాయిలో తృప్తి లభించలేదు. ఆరు నెలల్లో 60కిపైగా సినిమాలు విడుదలైనా ఇందులో నిర్మాతను ఆదుకున్నవి నాలుగంటే నాలుగు.
ఆదుకున్నవి మాత్రం నాలుగే
‘జేమ్స్’లో పునీత్రాజ్కుమార్
బెంగళూరు (ఎలక్ట్రానిక్ సిటీ), న్యూస్టుడే : మరికొన్ని రోజులు గడిస్తే ఏడాదిలో అప్పుడే ఆరునెలలు పూర్తైనట్లే. కరోనా ఆంక్షల నుంచి గట్టెక్కిన తరువాత చందనసీమకు పూర్వవైభవం లభిస్తుందని భావించిన సినీ వర్గాలకు ఆశించిన స్థాయిలో తృప్తి లభించలేదు. ఆరు నెలల్లో 60కిపైగా సినిమాలు విడుదలైనా ఇందులో నిర్మాతను ఆదుకున్నవి నాలుగంటే నాలుగు. మిగిలినవి ఎప్పుడు విడుదలయ్యాయో.. ఎప్పుడు బాక్సాఫీస్ను చేరుకున్నాయో కూడా తెలియదని ప్రేక్షకులే అంగీకరిస్తున్నారు. నిర్మాతలను ఆదుకున్నట్లుగా చెబుతున్న ఆ నాలుగు సినిమాల్లో కే.జీ.ఎఫ్2 సినిమా ఖండాంతరాలు దాటుకుని ప్రపంచ సినిమా స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు చందనసీమలో సినిమాలు రూ.పది కోట్ల క్లబ్లో చేరితే అందరూ అదో గొప్ప విషయంగా భావించేవారు. ‘ముంగారుమళె’ సినిమా విడుదలైన సందర్భంలో దానికి లభించిన ఆదరణను ఇప్పటికీ చర్చించుకుంటారు. ఆ సినిమా తరువాత రూ.100 కోట్ల క్లబ్లో చేరే సినిమాల్ని లెక్కించేవారు. ఈ ఏడాది విడుదలైన కే.జీ.ఎఫ్.2 సినిమా బారతీయ సినిమా రంగంలోనే అగ్రస్థానాన్ని చేరుకుని ఇతర భాషల సినీ రంగాలు కన్నడ చిత్రసీమవైపు చూసేలా చేసింది. ఈ సినిమా ఏకంగా రూ. 1250 కోట్లను వసూలు చేసి ఇప్పట్లో మరే సినిమా కూడా అందనంత ఎత్తుకు చేరుకుంది. ఆ సినిమా అనంతరం చిత్రసీమలో ఒకవిధంగా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏసినిమా గురించి ప్రస్తావించినా కేజీఎఫ్ గురించి ముందుగా ప్రస్తావిస్తున్నారట. దీన్ని చూసిన తరువాత ఇతర సినిమాల్ని చూసేందుకు వెనుకంజ వేస్తున్నారని చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఇతర సినిమాల్ని థియేటర్లలో చూసేందుకు విముఖత చూపుతున్నారు. అందుకే హౌస్ఫుల్ బోర్డులను థియేటర్ల ఎదుట చూసి ఎంతో కాలమైందని అంటారు. ఈ ఏడాదిలో కే.జీ.ఎఫ్.2, జేమ్స్, చార్లీ సినిమాలు ఘన విజయం సాధించగా లవ్మ్యాక్టైల్-2 సినిమా నిర్మాతను ఆర్థికంగా ఆదుకుంది. థియేటర్లకు ప్రేక్షకుల్ని ఆకర్షించే సినిమాలపై దృష్టి సారించాలని సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది నిర్మాతలను కోరారు.
‘కేజీఎఫ్.2’లో యశ్
‘చార్లీ’లో రక్షిత్శెట్టి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?