logo

కామాంధుడికి కఠిన శిక్ష

ముక్కుపచ్చలారని ఏడో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో వెంకటస్వామి అలియాస్‌ మునివెంకటస్వామి (24) అనే యువకుడికి బెంగళూరులోని నాలుగో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు పదేళ్ల కఠిన కారాగార

Published : 30 Jun 2022 00:46 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ముక్కుపచ్చలారని ఏడో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో వెంకటస్వామి అలియాస్‌ మునివెంకటస్వామి (24) అనే యువకుడికి బెంగళూరులోని నాలుగో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. రూ.25 వేలను జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మహదేవపురలో తన పొరుగింట్లో ఉంటున్న బాలికపై నిందితుడు రెండేళ్ల కిందట అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడ్ని అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితునికి శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని