కుటుంబ కథాచిత్రం.. ఓ మైలవ్
ఓ మైలవ్ చలనచిత్రం కుటుంబ సమేతంగా వెళ్లి చూడవచ్చని సినీ దర్శకుడు స్మైల్ శీను పేర్కొన్నారు. సోమవారం పత్రికాభవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిర్మాత రామాంజనేయులు, నటుడు అక్షిత్ శశికుమార్లతో కలిసి మాట్లాడారు.
మాట్లాడుతున్న దర్శకుడు స్మైల్ శీను, నిర్మాత జి.రామాంజిని, నటుడు అక్షిత్శశికుమార్
బళ్లారి గ్రామీణ, న్యూస్టుడే: ఓ మైలవ్ చలనచిత్రం కుటుంబ సమేతంగా వెళ్లి చూడవచ్చని సినీ దర్శకుడు స్మైల్ శీను పేర్కొన్నారు. సోమవారం పత్రికాభవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిర్మాత రామాంజనేయులు, నటుడు అక్షిత్ శశికుమార్లతో కలిసి మాట్లాడారు. ప్రేమ, స్నేహం, కుటుంబం కలయికతో ఉత్తమ సందేశాత్మక చిత్రంగా రూపొందించామన్నారు. ఈనెల 15న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. బెంగళూరు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలలో చిత్రీకరణ జరిగిందన్నారు. ఇందులో సీనియర్ నటుడు శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్, కీర్తి, అక్షితలు అద్భుతంగా నటించారని చెప్పారు. ఈ చిత్ర నిర్మాణానికి సుమారు రూ.8 కోట్ల వరకు ఖర్చు చేశామన్నారు. నిర్మాత, దర్శకుడు బళ్లారి వారే..ఈ చిత్రం విజయంతో బళ్లారికి కీర్తిని అందిస్తామన్నారు. నా దర్శకత్వంలో నాలుగో చిత్రమని శీను తెలిపారు. నిర్మాత రామాంజిని మాట్లాడుతూ జి.సి.బి ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించామన్నారు. పాటలకు డా.వి.నాగేంద్ర ప్రసాద్ సాహిత్యాన్ని, చరణ్ అర్జున్ సంగీతాన్ని సమకూర్చారని తెలిపారు. ఎస్.నారాయణ, సాధుకోకిల, టెన్నిస్ కృష్ణ, పవిత్ర లోకేష్, తదితరులు నటించారని తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో కథానాయకుడు అక్షిత్ శశికుమార్, కథానాయకి కీర్తి, అక్షిత పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!