విస్తరించిన రాబందుల రాజ్యం
రాబందుల రెక్కల చప్పుళ్లు వినిపించడమే అత్యంత అరుదుగా మారిన నేపథ్యంలో.. వాటి సంతతిని పెంచేందుకు ఆధునిక సాంకేతికత సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. వివిధ కారణాల వల్ల రాబందుల జాతి క్రమేపీ అంతరించి పోతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఆధునిక సాంకేతికతతో పక్షిజాతికి మనుగడ
దీర్ఘాలోచన.. ఆహారం కోసం ఎటువైపు వెళ్లాలి?
చామరాజనగర, న్యూస్టుడే : రాబందుల రెక్కల చప్పుళ్లు వినిపించడమే అత్యంత అరుదుగా మారిన నేపథ్యంలో.. వాటి సంతతిని పెంచేందుకు ఆధునిక సాంకేతికత సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. వివిధ కారణాల వల్ల రాబందుల జాతి క్రమేపీ అంతరించి పోతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 1980లో దేశ వ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా రాబందులు ఉండేవని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య మరీ తగ్గిపోయింది. ఇందుకు సంతానోత్పత్తి సామర్థ్యం సన్నగిల్లడం, ఆహారం కొరత ప్రధాన కారణాలని భావిస్తున్నారు. ఒక్కో రాబందు తన కడుపు నింపుకోవాలంటే వంద కిలోమీటర్ల దూరానికి పైగా సంచరిస్తుందట. నగరీకరణ, కళేబరాల్ని గుర్తించిన వెంటనే వాటిని ఖననం చేయడం, చెట్లను విచ్చలవిడిగా తొలగించడం వల్ల ఇవి కొండ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. మన దేశంలో ఒకప్పుడు పదికిపైగా రాబందు జాతులుండేవని భావించగా.. ప్రస్తుతం ఈ సంఖ్య మూడుకు చేరుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాబందుల సంతతిని సంరక్షించేందుకు మైసూరు విశ్వవిద్యాలయానికి చెందిన జనటిక్స్, జెనోమిక్స్ విభాగంతో రాష్ట్ర అటవీశాఖ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం అంశాలు ప్రస్తుతం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ రాబందుల జీవనక్రమం, ఆహారం, దాని వైఖరి తదితర అంశాలపై అధ్యయనం చేసి అందుకు తగిన వాతావరణాన్ని కల్పించే దిశగా అధ్యయనం కొనసాగుతుందని విశ్వవిద్యాలయం సభ్యులు తెలిపారు. అడవుల్లో లభించే కళేబరాల్ని మొన్నటి వరకు ఖననం, లేదా దహనం చేసేవారు. ఈ పరిణామాలు వాటికి ఆహార సమస్యను తీవ్రతరం చేసేవి. ఒక అధ్యయనం ప్రకారం అవి 95 శాతం ఆహార కొరతను ఎదుర్కొనేవని వెల్లడైంది. దీనిని గుర్తించే కర్ణాటక అటవీశాఖ ఇటీవల ఓ నిర్ణయానికి వచ్చింది. అడవుల్లో వివిధ కారణాల వల్ల మరణించే వన్యప్రాణుల కళేబరాల్ని ఖననం చేయకుండా అదే విధంగా అక్కడే వదిలిపెట్టాలని నిర్ణయించారు. ఇందువల్ల వాటిపైనే ఆధారపడి జీవనం సాగించే రాబందులు, నక్కలు, అడవి కుక్కలు, కాకులు, ఇతర పక్షులు, జంతువులకు ఆహార కొరతను గణనీయంగా తగ్గించవచ్చని భావించారు. ప్రస్తుతం ఈ నిర్ణయాన్నే అమలు చేస్తున్నారు. రాబందుల జీవన విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతనే ఎలాంటి చర్యల్ని తీసుకుంటే వాటి జాతి మనుగడ సాధ్యమనే విషయం వెల్లడవుతుందని అధికారులు పేర్కొన్నారు. నాగరహొళె అభయారణ్యంలో ఇటీవలి కాలంలో రాబందుల సంఖ్య అధికమైందని ఇదే పరిస్థితి మాదప్ప కొండల్లో, బండీపుర అభయారణ్యంలో కూడా ఎదురవుతోందని తెలిపారు. ఇది శుభపరిణామంగా భావిస్తున్నారు. రాష్ట్రంలోని రాబందుల సంరక్షణా కేంద్రమైన రామనగర జిల్లాల్లోని రామదేవర కొండల్లో కూడా వీటి సంఖ్య అధికమవడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది. మైసూరు విశ్వవిద్యాలయం జనటిక్స్ విభాగం సహకారంతో చేపట్టనున్న అధ్యయనం అనంతరం ఈ సంఖ్య గణనీయంగా ఎక్కువయ్యేందుకు దోహదపడుతుందని తెలిపారు.
రామదేవర కొండలో ఎరుపు మెడ రాబందు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా