నగర దారులపై.. విద్యుత్తు బస్సుల రయ్..రయ్
స్వాతంత్య్ర 75వ అమృత మహోత్సవం సందర్భంగా బెంగళూరు నగరవాసులకు బీఎంటీసీ 75 నాన్ ఏసీ విద్యుత్తు బస్సులను కొత్తగా వివిధ మార్గాల్లో నడపనుంది. ఈనెల 15న ఆ బస్సులు రహదారిపై సంచరించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పచ్చజెండా ఊపనున్నారు.
నగర రహదారులపై సంచరించనున్న నూతన విద్యుత్తు బస్సు
బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్టుడే: స్వాతంత్య్ర 75వ అమృత మహోత్సవం సందర్భంగా బెంగళూరు నగరవాసులకు బీఎంటీసీ 75 నాన్ ఏసీ విద్యుత్తు బస్సులను కొత్తగా వివిధ మార్గాల్లో నడపనుంది. ఈనెల 15న ఆ బస్సులు రహదారిపై సంచరించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పచ్చజెండా ఊపనున్నారు. 12 మీటర్ల పొడవు కలిగిన నాన్ ఏసీ విద్యుత్తు బస్సులను అశోక్ లేల్యాండ్ అందజేస్తుంది. కొత్త బస్సులు దూరం మార్గాల్లో సంచరిస్తాయి. తొలి దశలో యలహంక డిపో నుంచి బస్సుల సంచారం ప్రారంభిస్తామని బీఎంటీసీ అధికారులు తెలిపారు. యలహంక- శివాజినగర 290ఈ, యలహంక- కెంగేరి 402 బీ,డీ, మెజిస్టిక్ కెంపేగౌడ బస్టాండు- యలహంక ఉపనగర మార్గాల్లో తొలి విడత బస్సులు సంచరిస్తాయని వివరించారు. యలహంక డిపోలో విద్యుత్తు బస్సుల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మరో రెండు బిడది, అత్తిబెలె డిపోల్లో ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బస్సు తయారీ సంస్థ ఆ బస్సులకు డ్రైవర్ను కూడా నియమిస్తోంది. డ్రైవర్ బస్సు నిర్వహణ, ఛార్జింగ్, తదితర వాటిని పర్యవేక్షిస్తారు. 41 ఆసనాలతో కూడిన బస్సును అరగంట పాటు ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు సంచరిస్తాయి. మళ్లీ ఛార్జింగ్ చేస్తే అదనంగా 75 కిలోమీటర్లు సంచరిస్తాయని తెలిపారు. మెజిస్టిక్, కెంగేరి, యశ్వంతపుర, సిల్క్బోర్డు బస్సు డిపోల్లో మూడువందల విద్యుత్తు బస్సులను ఛార్జింగ్ చేసే అవకాశం కల్పించారు. దివ్యాంగులు బస్సు ఎక్కేందుకు కుర్చీ లిఫ్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా