logo

గవర్నరు కార్యదర్శి పేరిట మోసం

గవర్నరు పేరుతో ప్రజలను మోసగిస్తున్నాడనే ఆరోపణపై బళ్లారి నివాసి సదరుల్లాఖాన్‌ను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. గవర్నరు థావర్‌ చంద్‌ గహ్లోత్‌ వ్యక్తిగత కార్యదర్శిగా పరిచయం చేసుకుని వివిధ విశ్వవిద్యాలయాల్లో

Published : 08 Aug 2022 01:45 IST

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: గవర్నరు పేరుతో ప్రజలను మోసగిస్తున్నాడనే ఆరోపణపై బళ్లారి నివాసి సదరుల్లాఖాన్‌ను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. గవర్నరు థావర్‌ చంద్‌ గహ్లోత్‌ వ్యక్తిగత కార్యదర్శిగా పరిచయం చేసుకుని వివిధ విశ్వవిద్యాలయాల్లో సిండికేట్‌ సభ్యులుగా నియమిస్తానని చెప్పి నిందితుడు కొందరి వద్ద నగదు తీసుకుని మోసగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీమంతులు, పలుకుబడి కలిగిన వ్యక్తులకు నిందితుడు ఫోన్‌ చేసి సిండికేట్‌ సభ్యుడిగా చేస్తామని నమ్మించి నగదు తీసుకుని మోసగిస్తున్నాడు. రాజ్‌భవన్‌ నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని మరికొందరిని నమ్మించి మోసగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని